Political News

15 రోజుల రిమాండ్ కోరిన సీఐడీ

స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు…తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించారు. న్యాయమూర్తికి సిఐడి అధికారులు అందించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ-37 గా పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబును 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును సిఐడి అధికారులు కోరారు. 2021 డిసెంబర్ 9 కంటే ముందే నేరం జరిగిందని సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

ఇక, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు తప్పులతడకని ఆయన వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2021లో దాఖలైన రిమాండ్ రిపోర్టులో, ఎఫ్ ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని, ఇపుడు ఎలా వచ్చిందని ఆయన వాదిస్తున్నారని తెలుస్తోంది. సీఐడీ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అనుమతివ్వడంతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది. ఇక, ఈ కేసులో 409 సెక్షన్ ను తేవడంపై కూడా లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన సాక్ష్యాలు లేకుండా ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయకూడదని ఆయన వాదించారు.

ఇక, చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల ఫోన్ లొకేషన్స్ రికార్డు పరిశీలించాలని కోర్టును లూథ్రా కోరడం సంచలనం రేపుతోంది. మరోవైపు, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ స్కాం కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశామని, అరెస్టు చేసిన 24 గంటల్లోపే చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలుఉన్నాయా? అని న్యాయమూర్తి సీఐడీని ప్రశ్నించారు. చంద్రబాబుకు పీఏ శ్రీనివాస్ ద్వారా ముడుపుల ఆందాయని సీఐడీ వెల్లడించింది. ఈ కేసులో పారిపోయిన నిందితులను చంద్రబాబే కాపాడుతున్నాడని అనుమానం వ్యక్తం చేసింది.

This post was last modified on September 10, 2023 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago