Political News

తప్పు చేస్తే ఉరి తీయండి: చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అరెస్టు చేసిన తర్వాత మీడియాతో తొలిసారిగా మాట్లాడిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 37 ముద్దాయిగా ఉన్న తనను ఎఫ్ఐఆర్ లేకుండా, రిమాండ్ రిపోర్ట్ లేకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ఈ దేశ పౌరుడిగా తనకు ఉందని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన మండిపడ్డారు.

ప్రైమా ఫేసీ లేకుండా అరెస్ట్ చేసేందుకు ఏ అధికారం ఉందని చంద్రబాబు నిలదీశారు. తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే తనను నడిరోడ్డుపై ఉరితీయాలని చంద్రబాబు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తనను అరెస్టు చేసేందుకు అర్ధరాత్రి పూట వందలాదిమంది పోలీసులు రావాల్సిన పని ఏంటని ప్రశ్నించారు ఇది అరాచకం కాదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేశారని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అడ్డుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. తాను తప్పు చేస్తే నిరూపించాలని, ఇలా అక్రమ అరెస్టులు చేయడం సరికాదని హితవు పలికారు.

సత్యం, ధర్మం గెలుస్తాయని చంద్రబాబు అన్నారు. ప్రజలు, టిడిపి కార్యకర్తలు, టిడిపి నేతలు సంయమనం పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అని అరెస్టు చేశారని, సామాన్య పౌరుడిగా తనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని అన్నారు. చాలా బాధగా ఉందని, నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చంద్రబాబు అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపనని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని చంద్రబాబు అన్నారు.

This post was last modified on September 9, 2023 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

36 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago