Political News

విద్యుత్ చార్జీలు పెంచ‌బోం: చంద్ర‌బాబు హామీ!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని, ఏపీలో అధికారం చేప‌ట్టాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు.. దానికి అనుగుణంగానే అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల వ‌రాలు కూడా ఇస్తున్నారు. మేలో జ‌రిగిన మ‌హానాడులో ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టోలో మ‌హిళ‌ల‌పై అనేక వ‌రాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. అక్క‌డితో కూడా ఆగ‌కుండా.. తాజాగా కీల‌క‌మైన విద్యుత్ చార్జీల విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

ప్ర‌స్తుతం నాలుగేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్ విద్యుత్ చార్జీల‌ను 12 సార్లు పెంచార‌ని.. త‌మకు అధికారం ఇస్తే.. వ‌చ్చే ఐదేళ్ల కాలంలో ఒక్క‌సారి కూడా విద్యుత్ చార్జీల‌ను పెంచ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో బాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని.. సౌర, పవన విద్యుత్‌ను తీసుకొస్తామని, త‌ద్వారా విద్యుత్ ధ‌ర‌లు త‌గ్గిన ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

పేదవాళ్లను ఆర్థికంగాపైకి తీసుకొచ్చి.. వాళ్లను ధనికులను చేయాలని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దేశంలోను రాష్ట్రంలోనూ ధ‌నికులు ఎక్కువవుతున్నారని చంద్ర‌బాబు చెప్పారు. పేదవాళ్లు మాత్రం బాగుపడట్లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

పేదవాళ్లందరినీ భాగస్వాములను చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి వారిని ధనికులను చేయాల‌న్నారు. అనేక ఆలోచనలు చేసి అభివృద్ధికి నాంది పలకాలని, సమర్థత పెంచడానికి, ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడానికే ఆర్థిక సంస్కరణలు వచ్చాయని వివ‌రించారు. “డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి’’ అని చంద్రబాబు ప్ర‌క‌టించారు.

This post was last modified on September 8, 2023 2:30 pm

Share

Recent Posts

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

9 minutes ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

2 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

9 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

10 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

11 hours ago