తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుకు హోం గార్డు రవీందర్ మృతి కేసు సెగ భారీగా తగులుతోంది. జీతాలు సరిగా ఇవ్వడం లేదని, ఉన్నతాదికారులు తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. నాలుగు రోజుల కిందట ఘోషామహల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న 38 ఏళ్ల రవీందర్ తాజాగా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల్లో తీవ్ర అలజడి చోటు చేసుకుంది.
ఇప్పటికే రవీందర్కు మద్దతుగా హోం గార్డుల సంఘం ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే, ఉన్నతాధికా రులు ఈ ధర్నాకు అనుమతి లేదనడంతో కొంత వెనక్కి తగ్గారు. ఇక, ఇప్పుడు రవీందర్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల్లో ఆవేదన కట్టలు తెగుతోంది. వారంతా హైదరాబాద్కు చేరుకుని రవీందర్ భౌతిక కాయాన్ని సందర్శించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే.. కేసీఆర్ సర్కారు ఇక్కడ కూడా నిర్బంధం విధించింది.
రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు సస్పెండ్ చేయడంతోపాటు.. తక్షణం వారికి విధులు అప్పగించాలని హోం శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. అదేసమయంలో హైదరాబాద్కు ఇతర ప్రాంతాల నుంచి హోం గార్డులు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతలను సర్కిల్ ఇన్ స్పెక్టర్లకు అప్పగించింది. ఇక, హోం గార్డులు ఎవరైనా ప్రభుత్వం గీసిన లక్ష్మణ రేఖలు.. దాటితే వారిని తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.
బాధ్యత ఎవరిది?
హోం గార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటనపై ఆయన సతీమణి సంధ్య కన్నీరు మున్నీరు అయ్యారు. తన భర్త మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏఎస్ ఐ, కానిస్టేబుల్ తన భర్తను వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ఆరోపించారు. మొత్తంగా ఈ విషయం ఇప్పుడు కేసీఆర్ సర్కారుకు ఎన్నికలకు ముందు సెగపుట్టిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…