రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు విషయం వామపక్షాలకు ఎంతకీ తెగటం లేదు. అసలు కమ్యూనిస్టులతో పొత్తు వద్దని చాలామంది సీనియర్లు పదేపదే చెబుతున్నారు. ఎందుకంటే పొత్తుల్లో కమ్యూనిస్టులకు ఇచ్చే సీట్లతో పోటీచేసే అవకాశం తమకు ఎక్కడ చేజారిపోతుందో అనే టెన్షన్ చాలామందిలో పెరిగిపోతోంది. ఈ కారణంతోనే కేసీయార్ కమ్యూనిస్టులతో పొత్తు వద్దు పొమ్మంది. కేసీయార్ తరిమేస్తేనే తమ దగ్గరకు వచ్చిన కమ్యూనిస్టులతో తామెందుకు పొత్తు పెట్టుకోవాలని వాదించే సీనియర్లు కూడా ఉన్నారు.
అందుకనే పొత్తు విషయం ఎటూ తేలటంలేదు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమకు ఐడు అసెంబ్లీ సీట్లు కావాలని ప్రతిపాదించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ నియోజకవర్గాలు కావాలని అడిగారట. అయితే ఈ నియోజకవర్గాలను ఇచ్చే ఉద్దేశ్యంలో కాంగ్రెస్ లేదు. అసలు సీపీఐ అడిగినట్లుగా ఐదు స్ధానాలు సాధ్యంకాదని కూడా ఇంటర్నల్ టాక్ వినబడుతోంది.
కమ్యూనిస్టులతో పొత్తులు తప్పదని కాంగ్రెస్ అనుకుంటే మహాయితే ఎక్కడో ఒక నియోజకవర్గం ఇస్తే సరిపోతుదని సీనియర్లు బలంగా వాదిస్తున్నారు. ఎందుకంటే సీపీఐ అడిగినన్ని సీట్లిస్తే వెంటనే సీపీఎం కూడా తయారవుతుంది. కాంగ్రెస్ తో పొత్తు గురించి మాట్లాడుతున్నది ఇపుడు సీపీఐ ఒక్కటే. పొత్తు ఖరారైతే వెంటన సీపీఎం కూడా రంగంలోకి దిగుతుంది.
సీపీఐకి ఐదుసీట్ల ఇస్తే అదే పద్దతిలో సీపీఎంకు కూడా ఐదు సీట్లివ్వాల్సిందే అని సీనియర్లు టెన్షన్ పడుతున్నారు. అసలే పోటీచేయటం కోసం పార్టీలోనే విపరీతమైన పోటీ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులకు పదిసీట్లను వదులుకోవటం అంటే మామూలు విషయంకాదు. అందుకనే అసలు కమ్యూనిస్టులతో పొత్తువద్దని తప్పనిసరిలో పెట్టుకోవాల్సొస్తే ఎక్కడో చెరో నియోజకవర్గాన్ని కేటాయించాలని సీనియర్లంటున్నారు. అయితే ఆ రెండు నియోజకవర్గాలు ఏవి అనేది కూడా పెద్ద సమస్యగా మారేట్లుంది. అందుకనే కమ్యూనిస్టులతో పొత్తు చర్చలు ఎంతకీ తెగటంలేదు. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.
This post was last modified on September 8, 2023 2:18 pm
మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలపై తన మనసులో మాట వెల్లడించారు. పాలిటిక్స్కు తాను అతీతంగా ఉంటానని తేల్చి చెప్పారు. అయితే.. సహజంగానే…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ ది ప్రత్యేక స్థానం. 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి పోటీ…
కుమారి ఆంటీ. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలోనే కాదు బయట కూడా దాదాపు ఈ పేరు తెలియని వారు…
'కొండ'ను పిండి చేస్తాం. చేవెళ్లలో గెలవనివ్వం అని రేవంత్ రెడ్డి అనడం డ్రామా. కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ పీసీసీ చీఫ్…
నిన్న హఠాత్తుగా ప్రకటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాలు…