Political News

రాజాసింగ్కు పోటీగా బీజేపీలోనే మాజీ మంత్రి తనయుడు

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి పోటీ చేస్తారా? ఆయనపై బీజేపీ అధిష్ఠానం విధించిన సస్పెన్షన్ తొలిగిపోతుందా? అనే ప్రశ్నలు ఓ వైపు ఉండగానే.. మరోవైపు రాజాసింగ్కు సొంత పార్టీ నుంచే పోటీ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ టికెట్ కోసం మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు, బీజేపీ నేత విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకోవడమే అందుకు కారణం. దీంతో గోషామహల్ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

గోషామహల్ గా 2008లో మారిన ఈ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దివంగత ముఖేశ్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ రాజా సింగ్ దే ఆధిపత్యం కొనసాగింది. 2018 ఎన్నికల్లో అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. కానీ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో రాజా సింగ్ పై బీజేపీ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో రాజా సింగ్ మాట్లాడుతూ.. మళ్లీ సభకు వస్తానో లేదోననే ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో గోషామహల్లో పట్టు కోసం విక్రమ్ గౌడ్ పావులు కదుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బీజేపీకి బలం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో విక్రమ్ సాగుతున్నారని చెబుతున్నారు. కానీ రాజా సింగ్ సస్పెన్షన్ విషయంపై అధిష్ఠానం సానుకూలంగా ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో రాజా సింగ్ పై సస్పెన్షన్ తొలిగిపోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే రాజా సింగ్ పోటీకి సిద్ధమయ్యే అవకాశాలుంటాయి. మరి అప్పుడు విక్రమ్ పరిస్థితి ఏమిటన్నది చూడాలి.

This post was last modified on September 8, 2023 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కిల్ రీమేక్ అతడితోనా.. వామ్మో

ఇటీవలి కాలంలో ఓ చిన్న సినిమా బాలీవుడ్లో సంచలనం రేపింది. లక్ష్య అనే కొత్త హీరోను పెట్టి నిఖిల్ నగేష్…

50 mins ago

ఒక్కడిగా వస్తేనే కంగువకు లాభం

ఏదో దసరాకు మంచి డేట్ దొరికిందని అక్టోబర్ 10 లాక్ చేసుకుంటే రజనీకాంత్ వెట్టయన్ ఇచ్చిన షాక్ కి వాయిదా…

2 hours ago

ప్రకంపనలు రేపుతున్న జానీ మాస్టర్ వివాదం

లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు నివురు గప్పిన నిప్పులా మొదలై…

4 hours ago

రావణుడు చేసిన గాయానికి భైర చికిత్స

ఆదిపురుష్ రిలీజైనప్పుడు ఎక్కువ శాతం ట్రోలింగ్ కి గురైన పాత్ర సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడు. దర్శకుడు ఓం…

6 hours ago

వీరమల్లు వైపుకి దృష్టి మళ్లించాలి

పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడున్నా అభిమానులు మాకు ఒకటే ఉందన్న తీరులో ఎక్కడ చూసినా ఓజి జపంతో…

7 hours ago

తెలుగు డబ్బింగ్ పేర్లకు కరువొచ్చింది

ఈ మధ్య కాలంలో తమిళ టైటిల్స్ ని యధాతథంగా ఉంచేసి తెలుగులో డబ్బింగ్ చేయడం పరిపాటిగా మారింది. తలైవి, వలిమైతో…

7 hours ago