రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నేతలు ఎంత స్ధాయి వారైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సిందే అని బీజేపీ అధిష్టానం ముందే స్పష్టం చేసింది. దీని ప్రకారమే తెలంగాణా బీజేపీ 2వ తేదీనుండి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. అంటే ఇప్పటికి నాలుగురోజుల నుండి తీసుకుంటున్న దరఖాస్తులు సుమారు 750 దాటాయి. దరఖాస్తు చేసుకోవటానికి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఎంతమందైనా దరఖాస్తులు చేయవచ్చు. ఈ పద్దతిలోనే వందలాది దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం.
దరఖాస్తులు వస్తున్న విషయాన్ని, తీసుకుని ప్రాసెస్ చేస్తున్న విషయాన్ని పార్టీలో కీలక నేత ప్రకాష్ జవదేకర్ స్వయంగా పరిశీలించారు. అంతాబాగానే ఉంది కానీ ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రముఖ నేతల నుండి దరఖాస్తులు రాలేదు. 10వ తేదీతో ముగియబోయే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో వెయ్యికిపైగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. ఇదే సమమంలో ప్రముఖుల నుండి ఒక్క దరఖాస్తు కూడా రాలేదట.
అంబర్ పేట నుండి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ నుండి లక్ష్మణ్, గద్వాల నుండి డీకే అరుణ, హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్, ఆర్మూర్ నుండి ధర్మపురి అర్వింద్, దుబ్బాక నుండి రఘునందనరావు, చెన్నూరులో మాజీ ఎంపీ వివేక్, మహబూబ్ నగర్ నుండి జితేందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే వీరిలో ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఇక విజయశాంతి, మురళీధరరావు, గరికపాటి మోహనరావు, చాడ సురేష్ రెడ్డి, బూరనర్సయ్య గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నుండి ఎలాంటి సంకేతాలు లేవు.
వీళ్ళు ఏ నియోజకవర్గం నుండి పోటీచేస్తారు ? అసలు బీజేపీలో ఉంటారా ఉండరా అన్నది కూడా అయోమయంగానే ఉంది. అందుకనే పార్టీ క్యాడర్లో కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళ దరఖాస్తుల విషయంలో. అలాగే కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ విషయం కూడా ఏమీ తేలలేదు. ఎందుకంటే దరఖాస్తు ఇవ్వటానికి 10వ తేదీ ఆఖరు. అయితే బండేమో అమెరికాలో ఉన్నారు. హైదరాబాద్ కు 12వ తేదీన కానీ తిరిగిరారు. బండి విషయం సస్పెన్సుగా తయారైంది. బహుశా సీనియర్ల నుండి 9,10 తేదీల్లో దరఖాస్తులు రావచ్చని అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on September 8, 2023 10:28 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…