ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం కూడా. అయితే.. ఇప్పుడు ఆయన తీవ్ర ఫ్రెస్ట్రేషన్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాలి. పైగా ఆయన జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఆయనపై ఎక్కడాలేని ఒత్తిడి పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో ధర్మాన అనుకున్నట్టుగా పరిస్తితి అయితే లేదు.
నిజానికి శ్రీకాకుళం జిల్లాకు ఇటు వైసీపీ పార్టీపరంగాను, అటు జగన్ ప్రభుత్వం పరంగాను కీలకప్రాధాన్యం ఇస్తున్నారు. ఇద్దరు నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు. అదేవిధంగా ఏడుగురికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే.. శ్రీకాకుళం జిల్లాకు దక్కిన పదవులు భేష్ అనే చెప్పాలి. దీనికి కారణం.. ఇక్కడ బలమైన టీడీపీని ఢి కొట్టి.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం.
అయితే.. ఈ లక్ష్య సాధన విషయంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాస్.. టెన్షన్ పడుతున్నారు. ఎవరూ ఆయన మాట వినిపించుకోవడం లేదనే టాక్ సొంత వర్గంలోనే వినిపిస్తోంది. పైగా సొంత పార్టీ నేతలపైనే అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే లేదా, ఇంచార్జ్లపై అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులను ఓడించేందుకు సొంత నేతలే రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
దీంతో ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు ధర్మాన కృష్ణదాస్ ప్రయత్నిస్తున్నా.. ఎవరూ కూడా ఆయన మాటను వినిపించుకోవడం లేదనే మాట పార్టీలో వినిపిస్తోంది. కానీ, మరోవైపు పార్టీ అధిష్టానం మాత్రం దాస్పైనే భారం వేసేసింది. జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతను ఆయనకే అప్పగించింది. ఈ నేపథ్యంలోనే కృష్ణదాస్ ఇటీవల తీవ్ర ఒత్తిడితో ఉన్నట్టు కనిపిస్తున్నారని.. ఆయన వర్గం నాయకులు అంటున్నారు. మరి ఈ టెన్షన్ ఎప్పటికీ తీరుతుందో చూడాలి.
This post was last modified on September 8, 2023 9:41 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…