ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం కూడా. అయితే.. ఇప్పుడు ఆయన తీవ్ర ఫ్రెస్ట్రేషన్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాలి. పైగా ఆయన జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఆయనపై ఎక్కడాలేని ఒత్తిడి పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో ధర్మాన అనుకున్నట్టుగా పరిస్తితి అయితే లేదు.
నిజానికి శ్రీకాకుళం జిల్లాకు ఇటు వైసీపీ పార్టీపరంగాను, అటు జగన్ ప్రభుత్వం పరంగాను కీలకప్రాధాన్యం ఇస్తున్నారు. ఇద్దరు నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు. అదేవిధంగా ఏడుగురికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే.. శ్రీకాకుళం జిల్లాకు దక్కిన పదవులు భేష్ అనే చెప్పాలి. దీనికి కారణం.. ఇక్కడ బలమైన టీడీపీని ఢి కొట్టి.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం.
అయితే.. ఈ లక్ష్య సాధన విషయంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాస్.. టెన్షన్ పడుతున్నారు. ఎవరూ ఆయన మాట వినిపించుకోవడం లేదనే టాక్ సొంత వర్గంలోనే వినిపిస్తోంది. పైగా సొంత పార్టీ నేతలపైనే అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే లేదా, ఇంచార్జ్లపై అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులను ఓడించేందుకు సొంత నేతలే రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
దీంతో ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు ధర్మాన కృష్ణదాస్ ప్రయత్నిస్తున్నా.. ఎవరూ కూడా ఆయన మాటను వినిపించుకోవడం లేదనే మాట పార్టీలో వినిపిస్తోంది. కానీ, మరోవైపు పార్టీ అధిష్టానం మాత్రం దాస్పైనే భారం వేసేసింది. జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతను ఆయనకే అప్పగించింది. ఈ నేపథ్యంలోనే కృష్ణదాస్ ఇటీవల తీవ్ర ఒత్తిడితో ఉన్నట్టు కనిపిస్తున్నారని.. ఆయన వర్గం నాయకులు అంటున్నారు. మరి ఈ టెన్షన్ ఎప్పటికీ తీరుతుందో చూడాలి.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…