Political News

దొంగ ఓట్ల గుట్టు రట్టు చేసిన ఎమ్మెల్యే ఆనం

ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడం, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను జాబితాలో చేర్చడం వంటి అవకతవకలకు కొందరు అధికారులు పాల్పడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు…అందుకు బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదు కూడా చేశారు. ఇక, వాలంటీర్లను ఓట్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించవద్దంటూ కోర్టు ఆదేశాలున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్లతో ఆ పని చేయిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరు జిల్లా సంగంలో ఓటర్లు జాబితా వ్యవహారంపై వాలంటీర్ల సమావేశం జరిగిందన్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో స్థానిక వాలంటీర్లతో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపుపైనే ఆ సమావేశం జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అక్కడికి వెళ్లి వారిని నిలదీశారు. అధికారులు ఎవరూ లేకుండా వైసిపి నాయకులు వాలంటీర్లతో సమావేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు.

తమను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అక్కడి నుంచి వైసీపీ నాయకులు, వాలంటీర్లు మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ఘటనను ఫోటోలు, వీడియోలు తీసిన టిడిపి నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్తామని అన్నారు. కృష్ణాష్టమి సెలవు రోజున వాలంటీర్లకు పని ఏంటని, అందులోను వైసిపి నేతలతో వారు ఎందుకు సమావేశం అయ్యారని ఆనం నిలదీశారు. ఆ సమావేశంలో అధికారులు ఎవరూ ఎందుకు లేరని ప్రశ్నించారుజ వెంకటగిరి ఎమ్మెల్యే అయిన ఆనం రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆత్మకూరులో ఈ దొంగ ఓట్ల అవకతవకలపై ఆనం కొంతకాలంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం గుట్టు రట్టయింది.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

2 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

4 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago