ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడం, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను జాబితాలో చేర్చడం వంటి అవకతవకలకు కొందరు అధికారులు పాల్పడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు…అందుకు బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదు కూడా చేశారు. ఇక, వాలంటీర్లను ఓట్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించవద్దంటూ కోర్టు ఆదేశాలున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్లతో ఆ పని చేయిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరు జిల్లా సంగంలో ఓటర్లు జాబితా వ్యవహారంపై వాలంటీర్ల సమావేశం జరిగిందన్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో స్థానిక వాలంటీర్లతో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపుపైనే ఆ సమావేశం జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అక్కడికి వెళ్లి వారిని నిలదీశారు. అధికారులు ఎవరూ లేకుండా వైసిపి నాయకులు వాలంటీర్లతో సమావేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు.
తమను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అక్కడి నుంచి వైసీపీ నాయకులు, వాలంటీర్లు మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ఘటనను ఫోటోలు, వీడియోలు తీసిన టిడిపి నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్తామని అన్నారు. కృష్ణాష్టమి సెలవు రోజున వాలంటీర్లకు పని ఏంటని, అందులోను వైసిపి నేతలతో వారు ఎందుకు సమావేశం అయ్యారని ఆనం నిలదీశారు. ఆ సమావేశంలో అధికారులు ఎవరూ ఎందుకు లేరని ప్రశ్నించారుజ వెంకటగిరి ఎమ్మెల్యే అయిన ఆనం రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆత్మకూరులో ఈ దొంగ ఓట్ల అవకతవకలపై ఆనం కొంతకాలంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం గుట్టు రట్టయింది.
This post was last modified on September 7, 2023 8:03 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…