Political News

దొంగ ఓట్ల గుట్టు రట్టు చేసిన ఎమ్మెల్యే ఆనం

ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడం, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను జాబితాలో చేర్చడం వంటి అవకతవకలకు కొందరు అధికారులు పాల్పడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు…అందుకు బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదు కూడా చేశారు. ఇక, వాలంటీర్లను ఓట్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించవద్దంటూ కోర్టు ఆదేశాలున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్లతో ఆ పని చేయిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరు జిల్లా సంగంలో ఓటర్లు జాబితా వ్యవహారంపై వాలంటీర్ల సమావేశం జరిగిందన్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో స్థానిక వాలంటీర్లతో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపుపైనే ఆ సమావేశం జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అక్కడికి వెళ్లి వారిని నిలదీశారు. అధికారులు ఎవరూ లేకుండా వైసిపి నాయకులు వాలంటీర్లతో సమావేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు.

తమను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అక్కడి నుంచి వైసీపీ నాయకులు, వాలంటీర్లు మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ఘటనను ఫోటోలు, వీడియోలు తీసిన టిడిపి నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్తామని అన్నారు. కృష్ణాష్టమి సెలవు రోజున వాలంటీర్లకు పని ఏంటని, అందులోను వైసిపి నేతలతో వారు ఎందుకు సమావేశం అయ్యారని ఆనం నిలదీశారు. ఆ సమావేశంలో అధికారులు ఎవరూ ఎందుకు లేరని ప్రశ్నించారుజ వెంకటగిరి ఎమ్మెల్యే అయిన ఆనం రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆత్మకూరులో ఈ దొంగ ఓట్ల అవకతవకలపై ఆనం కొంతకాలంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం గుట్టు రట్టయింది.

This post was last modified on September 7, 2023 8:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago