Political News

దొంగ ఓట్ల గుట్టు రట్టు చేసిన ఎమ్మెల్యే ఆనం

ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడం, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను జాబితాలో చేర్చడం వంటి అవకతవకలకు కొందరు అధికారులు పాల్పడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు…అందుకు బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదు కూడా చేశారు. ఇక, వాలంటీర్లను ఓట్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించవద్దంటూ కోర్టు ఆదేశాలున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్లతో ఆ పని చేయిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరు జిల్లా సంగంలో ఓటర్లు జాబితా వ్యవహారంపై వాలంటీర్ల సమావేశం జరిగిందన్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో స్థానిక వాలంటీర్లతో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపుపైనే ఆ సమావేశం జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అక్కడికి వెళ్లి వారిని నిలదీశారు. అధికారులు ఎవరూ లేకుండా వైసిపి నాయకులు వాలంటీర్లతో సమావేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు.

తమను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అక్కడి నుంచి వైసీపీ నాయకులు, వాలంటీర్లు మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ఘటనను ఫోటోలు, వీడియోలు తీసిన టిడిపి నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్తామని అన్నారు. కృష్ణాష్టమి సెలవు రోజున వాలంటీర్లకు పని ఏంటని, అందులోను వైసిపి నేతలతో వారు ఎందుకు సమావేశం అయ్యారని ఆనం నిలదీశారు. ఆ సమావేశంలో అధికారులు ఎవరూ ఎందుకు లేరని ప్రశ్నించారుజ వెంకటగిరి ఎమ్మెల్యే అయిన ఆనం రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆత్మకూరులో ఈ దొంగ ఓట్ల అవకతవకలపై ఆనం కొంతకాలంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం గుట్టు రట్టయింది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

52 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

58 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago