Political News

మార్గదర్శి పై సీఐడీ సంచలన ఆరోపణలు

రామోజీరావుపై కక్ష సాధించేందుకే మార్గదర్శి చిట్ ఫండ్స్ ను సీఎం జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రామోజీరావుతోపాటు ఆయన కోడలు శైలజా కిరణ్ లను హైదరాబాదులో సిఐడి అధికారులు విచారణ జరిపారు. ఆ తర్వాత శైలజా కిరణ్ తనపై లుకౌట్ నోటీసు జారీ చేయడం, 798 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడం వంటి ఘటనలపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఏపీ సిఐడి అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం కూడా వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఏపీ సిఐడి ఏడీజీ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

మార్గదర్శిపై అన్నపూర్ణ దేవి అనే మహిళ ఫిర్యాదు చేశారని, ఆమెతో 90 చిట్స్ వేయించి 210 రూపాయలు చేతిలో పెట్టినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ ఏడీజీతో కలిసి మీడియాతో మాట్లాడిన అన్నపూర్ణాదేవి కూడా మార్గదర్శిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎనిమిదేళ్లుగా మార్గదర్శిలో చిట్స్ వేస్తున్నానని, ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని అన్నపూర్ణాదేవి అన్నారు. మొదట్లో బాగానే డబ్బులు ఇచ్చారని, ఆ తర్వాత ఒత్తిడి చేసి దాదాపు 90 చిట్స్ వేయించుకున్నారని ఆమె ఆరోపించారు. చివరికి తాను వేసిన చిట్టి డబ్బులు కూడా ఇవ్వలేదని, 17 చిట్స్ లో తనను డిఫాల్ట్ చేశారని ఆమె ఆరోపించారు. అన్ని చిట్స్ వేసిన తర్వాత చివరకు 210 రూపాయల వచ్చాయని, అందుకే కేసు పెట్టానని ఆమె చెప్పారు.

అన్నపూర్ణాదేవి వంటి బాధితులు ఎంతోమంది ఉన్నారని, అనేక నిబంధనలను మార్గదర్శి అతిక్రమించిందని ఆయన చెప్పారు. ఈ మోసాల గురించి ప్రజలకు తెలియాలని, కోట్ల రూపాయలు కట్టిన బాధితులు వేలల్లో మాత్రమే రిటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. దాదాపు 3000 మందికి అసలు తాము చిట్ వేసిన సంగతే తెలియదని సంచలన ఆరోపణలు చేశారు. 100 మంది ఘోస్ట్ ఖాతాదారులను గుర్తించి విచారణ జరిపామని అన్నారు. వారికి తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలను మార్గదర్శి వాడుకుంటుందని సంజయ్ ఆరోపించారు. అన్ని రూల్స్ పాటిస్తున్నామని ఖాతాదారులను మార్గదర్శి మోసం చేస్తుందని ఆయన ఆరోపణలు చేశారు.

ఆక్షన్ తేదీని నెలలపాటు పొడిగిస్తున్నారని, 40 శాతం చిట్ గ్రూపులలో చందాదారులే లేరని ఆయన ఆరోపించారు. కంపెనీయే సొంతగా చిట్స్ తీసుకుంటుందని, చెక్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా లెడ్జర్లో వివరాలు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఇక, సిఐడి విచారణను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సంజయ్.

This post was last modified on September 7, 2023 6:19 pm

Share
Show comments
Published by
Satya
Tags: Margadarsi

Recent Posts

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

2 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

5 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

5 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

6 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

7 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

8 hours ago