రామోజీరావుపై కక్ష సాధించేందుకే మార్గదర్శి చిట్ ఫండ్స్ ను సీఎం జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రామోజీరావుతోపాటు ఆయన కోడలు శైలజా కిరణ్ లను హైదరాబాదులో సిఐడి అధికారులు విచారణ జరిపారు. ఆ తర్వాత శైలజా కిరణ్ తనపై లుకౌట్ నోటీసు జారీ చేయడం, 798 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడం వంటి ఘటనలపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఏపీ సిఐడి అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం కూడా వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఏపీ సిఐడి ఏడీజీ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
మార్గదర్శిపై అన్నపూర్ణ దేవి అనే మహిళ ఫిర్యాదు చేశారని, ఆమెతో 90 చిట్స్ వేయించి 210 రూపాయలు చేతిలో పెట్టినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ ఏడీజీతో కలిసి మీడియాతో మాట్లాడిన అన్నపూర్ణాదేవి కూడా మార్గదర్శిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎనిమిదేళ్లుగా మార్గదర్శిలో చిట్స్ వేస్తున్నానని, ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని అన్నపూర్ణాదేవి అన్నారు. మొదట్లో బాగానే డబ్బులు ఇచ్చారని, ఆ తర్వాత ఒత్తిడి చేసి దాదాపు 90 చిట్స్ వేయించుకున్నారని ఆమె ఆరోపించారు. చివరికి తాను వేసిన చిట్టి డబ్బులు కూడా ఇవ్వలేదని, 17 చిట్స్ లో తనను డిఫాల్ట్ చేశారని ఆమె ఆరోపించారు. అన్ని చిట్స్ వేసిన తర్వాత చివరకు 210 రూపాయల వచ్చాయని, అందుకే కేసు పెట్టానని ఆమె చెప్పారు.
అన్నపూర్ణాదేవి వంటి బాధితులు ఎంతోమంది ఉన్నారని, అనేక నిబంధనలను మార్గదర్శి అతిక్రమించిందని ఆయన చెప్పారు. ఈ మోసాల గురించి ప్రజలకు తెలియాలని, కోట్ల రూపాయలు కట్టిన బాధితులు వేలల్లో మాత్రమే రిటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. దాదాపు 3000 మందికి అసలు తాము చిట్ వేసిన సంగతే తెలియదని సంచలన ఆరోపణలు చేశారు. 100 మంది ఘోస్ట్ ఖాతాదారులను గుర్తించి విచారణ జరిపామని అన్నారు. వారికి తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలను మార్గదర్శి వాడుకుంటుందని సంజయ్ ఆరోపించారు. అన్ని రూల్స్ పాటిస్తున్నామని ఖాతాదారులను మార్గదర్శి మోసం చేస్తుందని ఆయన ఆరోపణలు చేశారు.
ఆక్షన్ తేదీని నెలలపాటు పొడిగిస్తున్నారని, 40 శాతం చిట్ గ్రూపులలో చందాదారులే లేరని ఆయన ఆరోపించారు. కంపెనీయే సొంతగా చిట్స్ తీసుకుంటుందని, చెక్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా లెడ్జర్లో వివరాలు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఇక, సిఐడి విచారణను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సంజయ్.
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…