Political News

మార్గదర్శి పై సీఐడీ సంచలన ఆరోపణలు

రామోజీరావుపై కక్ష సాధించేందుకే మార్గదర్శి చిట్ ఫండ్స్ ను సీఎం జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రామోజీరావుతోపాటు ఆయన కోడలు శైలజా కిరణ్ లను హైదరాబాదులో సిఐడి అధికారులు విచారణ జరిపారు. ఆ తర్వాత శైలజా కిరణ్ తనపై లుకౌట్ నోటీసు జారీ చేయడం, 798 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడం వంటి ఘటనలపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఏపీ సిఐడి అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం కూడా వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఏపీ సిఐడి ఏడీజీ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

మార్గదర్శిపై అన్నపూర్ణ దేవి అనే మహిళ ఫిర్యాదు చేశారని, ఆమెతో 90 చిట్స్ వేయించి 210 రూపాయలు చేతిలో పెట్టినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ ఏడీజీతో కలిసి మీడియాతో మాట్లాడిన అన్నపూర్ణాదేవి కూడా మార్గదర్శిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎనిమిదేళ్లుగా మార్గదర్శిలో చిట్స్ వేస్తున్నానని, ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని అన్నపూర్ణాదేవి అన్నారు. మొదట్లో బాగానే డబ్బులు ఇచ్చారని, ఆ తర్వాత ఒత్తిడి చేసి దాదాపు 90 చిట్స్ వేయించుకున్నారని ఆమె ఆరోపించారు. చివరికి తాను వేసిన చిట్టి డబ్బులు కూడా ఇవ్వలేదని, 17 చిట్స్ లో తనను డిఫాల్ట్ చేశారని ఆమె ఆరోపించారు. అన్ని చిట్స్ వేసిన తర్వాత చివరకు 210 రూపాయల వచ్చాయని, అందుకే కేసు పెట్టానని ఆమె చెప్పారు.

అన్నపూర్ణాదేవి వంటి బాధితులు ఎంతోమంది ఉన్నారని, అనేక నిబంధనలను మార్గదర్శి అతిక్రమించిందని ఆయన చెప్పారు. ఈ మోసాల గురించి ప్రజలకు తెలియాలని, కోట్ల రూపాయలు కట్టిన బాధితులు వేలల్లో మాత్రమే రిటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. దాదాపు 3000 మందికి అసలు తాము చిట్ వేసిన సంగతే తెలియదని సంచలన ఆరోపణలు చేశారు. 100 మంది ఘోస్ట్ ఖాతాదారులను గుర్తించి విచారణ జరిపామని అన్నారు. వారికి తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలను మార్గదర్శి వాడుకుంటుందని సంజయ్ ఆరోపించారు. అన్ని రూల్స్ పాటిస్తున్నామని ఖాతాదారులను మార్గదర్శి మోసం చేస్తుందని ఆయన ఆరోపణలు చేశారు.

ఆక్షన్ తేదీని నెలలపాటు పొడిగిస్తున్నారని, 40 శాతం చిట్ గ్రూపులలో చందాదారులే లేరని ఆయన ఆరోపించారు. కంపెనీయే సొంతగా చిట్స్ తీసుకుంటుందని, చెక్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా లెడ్జర్లో వివరాలు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఇక, సిఐడి విచారణను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సంజయ్.

This post was last modified on September 7, 2023 6:19 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

39 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

59 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago