Political News

కర్రలు ఇచ్చాకే చిరుతలు దొరికాయట

తిరుమల కాలినడకన వెళుతున్న చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత చిరుతలను పట్టుకునేందుకు టీటీడీ, అటవీ శాఖా సిబ్బంది పలు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాల ఏర్పాటు చేసి చిరుత కదలికలను పసిగట్టారు. ఈ క్రమంలోనే చిరుతలను భయపెట్టేందుకు భక్తులకు కర్రలు ఇచ్చిన వ్యవహారం నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ట్రోలింగ్ జరిగింది. అయినా సరే తన కర్రల వ్యవహారంపై భూమన తగ్గేదేలే అంటున్నారు. తాజాగా మరో చిరుత బోనులో చిక్కుకున్న సందర్భంగా భూమన చేసిన కామెంట్లు మరోసారి ట్రోలింగ్ కు గురవుతున్నాయి.

తాజాగా 7వ మైలు- నరసింహ స్వామి ఆలయం మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పట్టుబడింది. గత 75 రోజుల వ్యవధిలో 5వ చిరుత పట్టుబడింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కరుణాకర్ రెడ్డి మరోసారి కర్రలపై స్పీచ్ దంచికొట్టారు. తాము కర్రలు ఇచ్చిన తర్వాతే చిరుతలు బోన్లలో చిక్కుతున్నాయని భూమన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. వినరో భాగ్యము భూమన ‘కర్ర’ కథ! అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు,భద్రతా సిబ్బందిని భక్తులకు తోడుగా పంపుతున్నామని, ఎక్కడా ఇబ్బంది లేకుండా యాత్రికులకు అదనంగా కర్రలిస్తామని చెప్పామని, అంతేగానీ, కర్రలిచ్చి మా పని అయిపోయింది అని చెప్పలేదని భూమన అన్నారు.

భక్తుల భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని, 200 మంది అటవీ సిబ్బంది..అధునాతన బోన్లు…నిరంతరం పర్యవేక్షణ జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా బాధ్యతగా టీటీడీ ఈవో నేతృత్వంలో పనిచేస్తున్నారని చెప్పారు. తమను విమర్శించి బూతులు మాట్లాడేవారికి కూడా ఇదే చెబుతున్నామని, యాత్రికుల భద్రతపై రాజీ పడబోమని అన్నారు.

ఇక, తమ ప్రయత్నాలతో కాలినడక మార్గంలో చిరుత, జంతువుల సంచారం తగ్గిందని డీఎఫ్ వో చెబుతున్నారు. ఈ చిరుతను ఎస్వీ జూ పార్క్ కు తరలించి క్వారంటైన్ లో పెడుతామన్నారు. ముంబైలోని ల్యాబ్ కు ఈ చిరుతకు సంబంధించిన శాంపిల్స్ పంపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత లక్షితపై దాడి చేసిన చిరుతను జూలో ఉంచి…మిగిలిన వాటిని అడవిలోకి వదిలేస్తామన్నారు. లక్షిత పై దాడి చేసిన చిరుత ఏది అన్నది తేలాల్సి ఉంది.

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

1 hour ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

2 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

5 hours ago

తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ…

11 hours ago