ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులపై రౌడీలతో దాడులు చేయిస్తున్నాడంటూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ప్రజావేదిక లో మాట్లాడుతూ.. నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“యువగళంలో ఎందుకు దాడులు చేయించారు. బాధితులపైనే ఎందుకు కేసులు పెడుతున్నారు” అని చంద్రబాబు నిలదీశారు. సీఎం జగన్ను కరడు గట్టిన సైకో అని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పెట్టి రివర్స్ పాలనకు తెరతీశారని విరుచుకుపడ్డారు. బటన్ నొక్కడం ఒక్కటే జగన్కు తెలుసని ఎద్దేవా చేశారు. ఈ సైకో ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
“నేను ష్యూరిటీ ఇస్తున్నా పేదలను ధనవంతులుగా మారుస్తా” అని చంద్రబాబు వాగ్దానం చేశారు. తమ పైన కేసులు పెట్టి లండన్లో ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో.. ఏం చేస్తున్నారో అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసి… మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని తనను రోడ్డుకు లాగారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
తనపైనా, తన కుటుంబసభ్యులపైనా అనేక రకాలుగా అపవాదులు వేశారని… రివర్స్లో కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లలో తన మీద హత్యాప్రయత్నం చేసి పైగా తన మీదే 307 కేసు పెట్టారని, తాను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తడి చేస్తూ పార్టీ కార్యకర్తల నుంచి స్టేట్మెంట్ రాయిస్తున్నారని అన్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…