ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులపై రౌడీలతో దాడులు చేయిస్తున్నాడంటూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ప్రజావేదిక లో మాట్లాడుతూ.. నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“యువగళంలో ఎందుకు దాడులు చేయించారు. బాధితులపైనే ఎందుకు కేసులు పెడుతున్నారు” అని చంద్రబాబు నిలదీశారు. సీఎం జగన్ను కరడు గట్టిన సైకో అని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పెట్టి రివర్స్ పాలనకు తెరతీశారని విరుచుకుపడ్డారు. బటన్ నొక్కడం ఒక్కటే జగన్కు తెలుసని ఎద్దేవా చేశారు. ఈ సైకో ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
“నేను ష్యూరిటీ ఇస్తున్నా పేదలను ధనవంతులుగా మారుస్తా” అని చంద్రబాబు వాగ్దానం చేశారు. తమ పైన కేసులు పెట్టి లండన్లో ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో.. ఏం చేస్తున్నారో అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసి… మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని తనను రోడ్డుకు లాగారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
తనపైనా, తన కుటుంబసభ్యులపైనా అనేక రకాలుగా అపవాదులు వేశారని… రివర్స్లో కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లలో తన మీద హత్యాప్రయత్నం చేసి పైగా తన మీదే 307 కేసు పెట్టారని, తాను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తడి చేస్తూ పార్టీ కార్యకర్తల నుంచి స్టేట్మెంట్ రాయిస్తున్నారని అన్నారు.
This post was last modified on September 6, 2023 1:39 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…