ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులపై రౌడీలతో దాడులు చేయిస్తున్నాడంటూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ప్రజావేదిక లో మాట్లాడుతూ.. నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“యువగళంలో ఎందుకు దాడులు చేయించారు. బాధితులపైనే ఎందుకు కేసులు పెడుతున్నారు” అని చంద్రబాబు నిలదీశారు. సీఎం జగన్ను కరడు గట్టిన సైకో అని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పెట్టి రివర్స్ పాలనకు తెరతీశారని విరుచుకుపడ్డారు. బటన్ నొక్కడం ఒక్కటే జగన్కు తెలుసని ఎద్దేవా చేశారు. ఈ సైకో ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
“నేను ష్యూరిటీ ఇస్తున్నా పేదలను ధనవంతులుగా మారుస్తా” అని చంద్రబాబు వాగ్దానం చేశారు. తమ పైన కేసులు పెట్టి లండన్లో ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో.. ఏం చేస్తున్నారో అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసి… మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని తనను రోడ్డుకు లాగారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
తనపైనా, తన కుటుంబసభ్యులపైనా అనేక రకాలుగా అపవాదులు వేశారని… రివర్స్లో కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లలో తన మీద హత్యాప్రయత్నం చేసి పైగా తన మీదే 307 కేసు పెట్టారని, తాను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తడి చేస్తూ పార్టీ కార్యకర్తల నుంచి స్టేట్మెంట్ రాయిస్తున్నారని అన్నారు.
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…