ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేసీయార్ను రుణమాఫీ పీడకలలాగ వెంటాడుతోంది. 2018 ఎన్నికల్లో గెలుపుకు రైతులకు రుణామాఫీ చేస్తానని కేసీయార్ హామీ ఇచ్చేశారు. గెలిచిన తర్వాత ఇంతకాలం చప్పుడు చేయలేదు. అలాంటిది నెలక్రితం సడెన్ గా రుణమాఫీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా అందుకనే. రుణమాఫీ జరగకపోతే రైతులు ఎలా రియాక్టవుతారో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే హడావుడి చేసి ఉన్నతాధికారుల నెత్తిన కూర్చుని నిధుల సేకరణ మొదలుపెట్టారు.
ప్రభుత్వం లెక్కల ప్రకారం రుణాలు అందుకోవాల్సిన రైతుల సంఖ్య 40 లక్షలు. వీరిలో రు. 99,999 రుణమున్న వాళ్ళ సంఖ్య సుమారు 11 లక్షలు. లక్ష రూపాయలు రుణం ఉన్నవాళ్ళు మరో 20 లక్షలుంటారు. హోలుమొత్తం అనర్హులని తేల్చిన రైతుల సంఖ్య సుమారు 4 లక్షలు. మిగిలిన ఐదు లక్షల మంది రైతులు లక్ష రూపాయలకన్నా ఎక్కువ రుణం ఉన్న రైతులు. నానా అవస్తలు పడి రు. 99,999 అప్పున్న రైతులు 10 లక్షల మందికి మాఫీ జరిగిపోయింది.
మరి లక్ష రూపాయలు, అంతకుమించి అప్పున్న 25 లక్షల రైతుల మాటేమిటి ? అనే ప్రశ్న మొదలైంది. వాళ్ళ ఆప్పులు తీర్చటానికే కేసీయార్ ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు. ఎక్కడెక్కడి నిధులు తీసుకొచ్చి ఇపుడు 25 లక్షల రైతుల అప్పులు తీర్చటానికే ప్రాధాన్యతిస్తున్నారు. మొత్తం అప్పును ఈనెలాఖరులోగా తీర్చేయాలన్నది కేసీయార్ టార్గెట్.
25 లక్షల మంది రైతుల అప్పులు తీరాలంటే ప్రభుత్వం రు. 13 వేల కోట్లు జమచేయాలి. ఇప్పటికి తీర్చింది సుమారు రు. 2 వేల కోట్లు మాత్రమే. ఇంకా 11 వేల కోట్ల రూపాయలను ఎలా సేకరించాలో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులను ఒకటే బాదుడు మొదలుపెట్టారు. మొత్తానికి నోటికొచ్చినట్లుగా హామీలిచ్చేస్తే నిధులు లేకపోతే పరిస్ధితి ఎలాగుంటుందనేందుకు కేసీయార్ ప్రభుత్వమే ఉదాహరణ. తెలంగాణాయే కాదు ఏపీ, తమిళనాడు, కర్నాటక ఏ ప్రభుత్వం తీసుకున్నా ఇదే పరిస్ధితి. వీళ్ళిచ్చే ఉచిత హామీలు, రుణమాఫీ హామీలతో ప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి. ఈ పరిస్ధితి ఎప్పటికి మారుతుందో ఏమో.
This post was last modified on September 6, 2023 12:27 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…