Political News

కేసీయార్ ను వెంటాడుతున్న రుణమాఫీ

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేసీయార్ను రుణమాఫీ పీడకలలాగ వెంటాడుతోంది. 2018 ఎన్నికల్లో గెలుపుకు రైతులకు రుణామాఫీ చేస్తానని కేసీయార్ హామీ ఇచ్చేశారు. గెలిచిన తర్వాత ఇంతకాలం చప్పుడు చేయలేదు. అలాంటిది నెలక్రితం సడెన్ గా రుణమాఫీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా అందుకనే. రుణమాఫీ జరగకపోతే రైతులు ఎలా రియాక్టవుతారో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే హడావుడి చేసి ఉన్నతాధికారుల నెత్తిన కూర్చుని నిధుల సేకరణ మొదలుపెట్టారు.

ప్రభుత్వం లెక్కల ప్రకారం రుణాలు అందుకోవాల్సిన రైతుల సంఖ్య 40 లక్షలు. వీరిలో రు. 99,999 రుణమున్న వాళ్ళ సంఖ్య సుమారు 11 లక్షలు. లక్ష రూపాయలు రుణం ఉన్నవాళ్ళు మరో 20 లక్షలుంటారు. హోలుమొత్తం అనర్హులని తేల్చిన రైతుల సంఖ్య సుమారు 4 లక్షలు. మిగిలిన ఐదు లక్షల మంది రైతులు లక్ష రూపాయలకన్నా ఎక్కువ రుణం ఉన్న రైతులు. నానా అవస్తలు పడి రు. 99,999 అప్పున్న రైతులు 10 లక్షల మందికి మాఫీ జరిగిపోయింది.

మరి లక్ష రూపాయలు, అంతకుమించి అప్పున్న 25 లక్షల రైతుల మాటేమిటి ? అనే ప్రశ్న మొదలైంది. వాళ్ళ ఆప్పులు తీర్చటానికే కేసీయార్ ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు. ఎక్కడెక్కడి నిధులు తీసుకొచ్చి ఇపుడు 25 లక్షల రైతుల అప్పులు తీర్చటానికే ప్రాధాన్యతిస్తున్నారు. మొత్తం అప్పును ఈనెలాఖరులోగా తీర్చేయాలన్నది కేసీయార్ టార్గెట్.

25 లక్షల మంది రైతుల అప్పులు తీరాలంటే ప్రభుత్వం రు. 13 వేల కోట్లు జమచేయాలి. ఇప్పటికి తీర్చింది సుమారు రు. 2 వేల కోట్లు మాత్రమే. ఇంకా 11 వేల కోట్ల రూపాయలను ఎలా సేకరించాలో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులను ఒకటే బాదుడు మొదలుపెట్టారు. మొత్తానికి నోటికొచ్చినట్లుగా హామీలిచ్చేస్తే నిధులు లేకపోతే పరిస్ధితి ఎలాగుంటుందనేందుకు కేసీయార్ ప్రభుత్వమే ఉదాహరణ. తెలంగాణాయే కాదు ఏపీ, తమిళనాడు, కర్నాటక ఏ ప్రభుత్వం తీసుకున్నా ఇదే పరిస్ధితి. వీళ్ళిచ్చే ఉచిత హామీలు, రుణమాఫీ హామీలతో ప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి. ఈ పరిస్ధితి ఎప్పటికి మారుతుందో ఏమో.

This post was last modified on September 6, 2023 12:27 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

57 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

2 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

2 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

3 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

3 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

4 hours ago