తెలంగాణా నేత డీకే అరుణ విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే గద్వాల అభ్యర్ధిగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆమెపై గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డిని హైకోర్టు ఈమధ్యనే అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం హైకోర్టు గనుక ఎంఎల్ఏని లేదా ఎంపీని అనర్హుడిగా ప్రకటిస్తే ఓడిపోయిన అభ్యర్ధులను గెలిచినట్లు ప్రకటించాలి. సో హైకోర్టు తీర్పు ప్రకారం కృష్ణమోహన్ అనుర్హుడవ్వటంతో డీకే అరుణే ఎంఎల్ఏ అయిపోయారు.
డీకే అరుణే ఎంఎల్ఏగా కోర్టు ప్రకటించేసింది. అయితే అప్పట్లో ఓడిపోయిన డీకే తర్వాత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఇపుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా. అంటే డీకే ఉన్నదేమో బీజేపీలో. కానీ ఎంఎల్ఏ అయ్యింది మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున. మామూలుగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే చాలామంది ఒకపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు మరోపార్టీలోకి ఫిరాయించేస్తున్నారు.
అయితే వాళ్ళ వ్యవహారం ఎలాగుందంటే వాళ్ళేమీ తాము గెలిచిన పార్టీలకు రాజీనామాలు చేయలేదు. కాంగ్రెస్ తరపున ఎంఎల్ఏలుగా గెలిచిన 12 మంది పార్టీకి రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ డీకే అలాకాదు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరారు. అంటే సాంకేతికంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఎలాంటి సంబంధంలేదు. కానీ హై కోర్టు తీర్పుప్రకారం ఆమె కాంగ్రెస్ ఎంఎల్ఏనే.
ఇక్కడే డీకే విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. బీజేపీ నిబంధనల ప్రకారం కాంగ్రెస్ ఎంఎల్ఏగాను, కాంగ్రెస్ కు రాజీనామా చేస్తేనే చేర్చుకుంటున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేస్తేనే బీజేపీ చేర్చుకున్నది. మరిపుడు డీకే ఏమిచేస్తారో చూడాలి. పార్టీకి ఇంతకుముందే రాజీనామా చేశారు కాబట్టి సమస్యలేదు. తాను బీజేపీ నేతనే అని ఆమె చెప్పుకుంటున్నారు. మరిపుడు కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవిని ఏమిచేస్తారు ? బీజేపీ నిబంధన ప్రకారం డీకే ఇపుడు కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాల్సుంటుంది. మరి రాజీనామా చేస్తారా ? అన్నదే ఆసక్తిగా మారింది.
This post was last modified on September 5, 2023 10:36 am
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…