Political News

మైనంపల్లి టెన్షన్ పెంచేస్తున్నారా ?

ఏ విషయం తేల్చకుండా మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు టెన్షన్ పెంచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీలో పోటీకి కేసీయార్ టికెట్ ప్రకటించారు. అయితే టికెట్ తీసుకోవటానికి హనుమంతరావు నిరాకరించారు. కారణం ఏమిటంటే మెదక్ లో తన కొడుకు రోహిత్ కు కూడా టికెట్ ఇస్తేనే మల్కాజ్ గిరిలో తాను పోటీచేస్తానని చెప్పారు. తండ్రి, కొడుకులు ఇద్దరికీ టికెట్లు ఇవ్వటం కేసీయార్ కు ఇష్టంలేదు. అందుకనే మెదక్ లో కేసీయార్ టికెట్ ప్రకటించేశారు.

అప్పటినుండి ఇటు కేసీయార్ అటు మైనంపల్లికి మధ్య వివాదం పెరిగిపోతోంది. మైనంపల్లి టికెట్ తీసుకుంటే తీసుకున్నట్లు లేకపోతే ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని కేసీయార్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే ఏమిచేయాలో తనకూ తెలుసని మైనంపల్లి రివర్సులో మాట్లాడారు. దాంతో మైనంపల్లి ఏమి చేయబోతున్నారనేది బాగా ఆసక్తికరంగా తయారైంది. విజయవాడలోని కనకమ్మదుర్గమ్మను దర్శించుకుని వచ్చిన తర్వాత తన నిర్ణయం ఏమిటో చెబుతానని తాజాగా మైనంపల్లి ప్రకటించారు.

తాజా ప్రకటనతో పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎంఎల్ఏ మీద కేసీయార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనంపల్లి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందే అని సీనియర్లు చాలామంది కేసీయార్ పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కేసీయార్ ఎందుకు వెనకాడుతున్నారంటే ఎంఎల్ఏ ప్రభావం మరో మూడు నియోజకవర్గాలపై ఉంటుందట. మైనంపల్లి గనుక బీఆర్ఎస్ ను వదిలేస్తే ఏ పార్టీలో చేరుతారనేది కీలకమైంది.

ఎంఎల్ఏ గనుక కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బఖాయం. అదే బీజేపీలో చేరితే తగిలే దెబ్బ అంత తీవ్రంగా ఉండదని కేసీయార్ అంచనా. అందుకనే మైనంపల్లి ఏమిచేస్తారా అని కేసీయార్ వెయిట్ చేస్తున్నారు. కేసీయార్ వెయిట్ చేసే కొద్ది పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి కాంగ్రెస్ లో చేరినా ఎంఎల్ఏ కొడుక్కి టికెట్ ఇవ్వటం సాధ్యంకాదు. ఇద్దరికీ టికెట్లు కావాలంటే బహుశా అది బీజేపీలో మాత్రమే సాధ్యమవుతుందేమో. మరి దుర్గమ్మ దర్శనం అయిన తర్వాత మైనంపల్లి ఏమి ప్రకటిస్తారో చూడాల్సిందే.

This post was last modified on September 4, 2023 12:49 pm

Share

Recent Posts

బోండా గండం గట్టేక్కినట్లే

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం వర్ధంతి సభలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇపుడు తెలుగునాట చర్చనీయంశంగా మారింది.…

54 minutes ago

అల్లు అర్జున్ ప్లానింగ్ అందరికీ రాదు

స్టార్ హీరోలు ఎవరికైనా అభిమానులుంటారు. కానీ వాళ్ళతో ఒక ప్రణాళికాబద్ధమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అందరి వల్ల కాదు. సీనియర్లలో చిరంజీవి…

1 hour ago

సాలీడు మనిషి వణుకు పుట్టిస్తున్నాడు

ఎల్లుండి విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ షాకవుతోంది. ఈ సిరీస్…

2 hours ago

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు…

5 hours ago

ఇకపై అలా జరగదన్న బోండా ఉమ

దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్…

5 hours ago

అక్కడ అమితాబ్… ఇక్కడ రానా

టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ఇంతకుముదులా వరుసగా సినిమాలు చేయడం లేదు. హీరోగా అయితే సినిమాలు పూర్తిగా ఆపేశాడు. విలన్,…

6 hours ago