Political News

లోకల్ లీడర్లపై ఫోకస్ పెట్టిందా ?

బీజేపీ రూటుమార్చినట్లుంది. రాష్ట్రస్ధాయి నేతలపైన కాకుండా లోకల్ లీడర్లపైన చూపు తిప్పినట్లుంది. నియోజకవర్గాల్లో బలంగా ఉండే ద్వితీయశ్రేణి నేతలను పార్టీలో చేర్చుకుంటే ఎక్కువ లాభం ఉంటుందని కమలనాదులు అనుకుంటున్నట్లు సమాచారం. ఎలాగూ రాష్ట్రస్ధాయి నేతలు పార్టీలో చేరటంపై పెద్దగా మొగ్గు చూపటంలేదు. అలాంటపుడు వాళ్ళకోసం వెయిట్ చేయటం, గాలమేస్తు కాలాన్ని వేస్టుచేసుకోవటం ఎందుకని అనుకున్నారట. అందుకనే వివిధ నియోజకవర్గాల్లో మండలస్ధాయిలో గట్టి లీడర్లుగా పేరున్న వాళ్ళని చేర్చుకోవటంపైన ఫోకస్ పెట్టారట.

నేతల జాయినింగ్స్ కమిటి ఛైర్మన్ గా ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే చెప్పుకోదగ్గ స్ధాయి నేతలను పార్టీలో చేర్చిన దాఖలాలు లేవు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత నుండి బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలెవరు చేరలేదు. అందుకనే కమిటి ఫెయిలైందనే చెప్పాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ లో చాలామంది నేతలు చేరారు. చేరటానికి రెడీగా ఉన్నారు. సో ఇదంతా చూసిన తర్వాత రాష్ట్రస్ధాయి నేతలను చేర్చుకోవటంపై ప్రయత్నాలు చేయటం అనవసరమని అనుకున్నట్లున్నారు.

ఇదే విషయమై ఈటల మాట్లాడుతు అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా జాయినింగ్స్ పై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోను బహిరంగసభలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈటల ప్రకటనపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే బీజేపీలో చేరటానికి ఎవరు ఇష్టపడకపోతే ఇక అసెంబ్లీ నియోజకవర్గాల స్ధాయిలో చేరటానికి ఎవరు ఇష్టపడతారు అనే చర్చ మొదలైంది.

విచిత్రం ఏమిటంటే అభ్యర్ధుల ప్రకటన కేసీయార్ చేయగానే పార్టీలో అసంతృప్తులు బయటపడుతున్నాయి. టికెట్లు రాని ఏడుమంది సిట్టింగులతో పాటు టికెట్లు దక్కని ఆశావహుల్లో చాలామంది కేసీయార్ పై మండిపోతున్నారు. వీళ్ళల్లో కూడా కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతేకానీ బీజేపీ వైపు ఎవరూ చూడలేదు. దీంతోనే కమలనాదుల్లో క్లారిటి వచ్చేసింది తమవైపు పెద్ద నేతలు ఎవరు రావటంలేదని. అందుకనే చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ మొదటిజాబితా కోసం ఎదురుచూస్తోంది. మరి బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుటవుతుదో చూడాల్సిందే.

Satya

Recent Posts

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

10 minutes ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

21 minutes ago

ఆంధ్రాలో గద్దర్ విగ్రహం: పవన్ కల్యాణ్

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…

1 hour ago

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్

తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…

1 hour ago

తెలంగాణ ప్రభుత్వానికి పవన్ సవాల్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్‌పల్లి…

1 hour ago

హైద‌రాబాద్‌లో ఐమాక్స్… ఒక‌టి కాదు

దేశంలో అత్య‌ధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. గ‌తంలో…

2 hours ago