Political News

కాంగ్రెస్ ఎంఎల్ఏల మీద మండిపోతున్న రేవంత్

చదవటానికి కాస్త ఆశ్చర్యంగా ఉందా ? పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏమిటి సొంతపార్టీ ఎంఎల్ఏల మీద మండిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? మండుతున్నది నిజమే కానీ ఇపుడు పార్టీలో ఉన్న ఎంఎల్ఏల మీదకాదు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధులుగా గెలిచి తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వాళ్ళమీద. అలా ఫిరాయించిన ఎంఎల్ఏలు 12 మంది ఉన్నారట. వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకనిచ్చేది లేదని సవాలు చేశారు.

కందాళం ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధనరెడ్డి లాంటి 12 మంది ఎంఎల్ఏలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. వెళ్ళేవాళ్ళు పార్టీకి రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ ఎంఎల్ఏలుగానే బీఆర్ఎస్ లో చెలామణి అవుతున్నారు. ఇదే విషయమై రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ లీడర్లంతా ఏకమై బీఆర్ఎస్ అభ్యర్ధులకు చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎంఎల్ఏలకు రాబోయే ఎన్నికల్లో కేసీయార్ మళ్ళీ టికెట్లు ప్రకటించారు. దాంతో అందరు ఈసారి అచ్చంగా బీఆర్ఎస్ టికెట్ పైనే పోటీకి రెడీ అవుతున్నారు. మరి ఈ 12 మందిపైన కాంగ్రెస్ తరపున ఎవరిని పోటీకి దింపబోతున్నది రేవంత్ ఎక్కడా చెప్పలేదు. దాంతో వీళ్ళ పోటీపై ఆయా నియోజకవర్గాల్లో ఆసక్తి బాగా పెరిగిపోతోంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే కాంగ్రెస్ లో చేరితే కొత్తగూడెంలో జలగం వెంకటరావు బీఆర్ఎస్ అభ్యర్ధి వనమాపై పోటీచేయచ్చు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరితే కందాళంపైన పోటీచేయచ్చు.

బహుశా హర్షవర్ధన్ రెడ్డిపైన జూపల్లి కృష్ణారావు పోటీచేసే అవకాశముంది. మరి మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను ఫైనల్ చేయాల్సుంటంది. అప్పుడు పోటీ మంచి రసకందాయంలో పడుతుందనే అనుకోవాలి. గెలుపు ఓటములను పక్కనపెట్టేస్తే పోటీయే మహారంజుగా ఉంటుందనటంలో సందేహంలేదు. అభ్యర్ధులను ఫైనల్ చేసేదేదో వెంటనే చేసేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కురుక్షేత్రాన్ని తలపించటం ఖాయం. 

This post was last modified on September 2, 2023 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago