Political News

కాంగ్రెస్ ఎంఎల్ఏల మీద మండిపోతున్న రేవంత్

చదవటానికి కాస్త ఆశ్చర్యంగా ఉందా ? పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏమిటి సొంతపార్టీ ఎంఎల్ఏల మీద మండిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? మండుతున్నది నిజమే కానీ ఇపుడు పార్టీలో ఉన్న ఎంఎల్ఏల మీదకాదు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధులుగా గెలిచి తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వాళ్ళమీద. అలా ఫిరాయించిన ఎంఎల్ఏలు 12 మంది ఉన్నారట. వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకనిచ్చేది లేదని సవాలు చేశారు.

కందాళం ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధనరెడ్డి లాంటి 12 మంది ఎంఎల్ఏలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. వెళ్ళేవాళ్ళు పార్టీకి రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ ఎంఎల్ఏలుగానే బీఆర్ఎస్ లో చెలామణి అవుతున్నారు. ఇదే విషయమై రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ లీడర్లంతా ఏకమై బీఆర్ఎస్ అభ్యర్ధులకు చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎంఎల్ఏలకు రాబోయే ఎన్నికల్లో కేసీయార్ మళ్ళీ టికెట్లు ప్రకటించారు. దాంతో అందరు ఈసారి అచ్చంగా బీఆర్ఎస్ టికెట్ పైనే పోటీకి రెడీ అవుతున్నారు. మరి ఈ 12 మందిపైన కాంగ్రెస్ తరపున ఎవరిని పోటీకి దింపబోతున్నది రేవంత్ ఎక్కడా చెప్పలేదు. దాంతో వీళ్ళ పోటీపై ఆయా నియోజకవర్గాల్లో ఆసక్తి బాగా పెరిగిపోతోంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే కాంగ్రెస్ లో చేరితే కొత్తగూడెంలో జలగం వెంకటరావు బీఆర్ఎస్ అభ్యర్ధి వనమాపై పోటీచేయచ్చు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరితే కందాళంపైన పోటీచేయచ్చు.

బహుశా హర్షవర్ధన్ రెడ్డిపైన జూపల్లి కృష్ణారావు పోటీచేసే అవకాశముంది. మరి మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను ఫైనల్ చేయాల్సుంటంది. అప్పుడు పోటీ మంచి రసకందాయంలో పడుతుందనే అనుకోవాలి. గెలుపు ఓటములను పక్కనపెట్టేస్తే పోటీయే మహారంజుగా ఉంటుందనటంలో సందేహంలేదు. అభ్యర్ధులను ఫైనల్ చేసేదేదో వెంటనే చేసేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కురుక్షేత్రాన్ని తలపించటం ఖాయం. 

This post was last modified on September 2, 2023 12:41 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

21 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

23 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

3 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

5 hours ago