ఎన్నికల్లో గెలుపుకోసం బీఆర్ఎస్ అభ్యర్ధులు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమపథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ఒకటే ఊదరగొడుతోంది. దీనికి అదనంగా సెంటిమెంటు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా జనాలను దేవాలయాలకు తీసుకెళుతున్నారు బీఆర్ఎస్ ఎంఎల్ఏల అభ్యర్ధులు. ఆర్మూరు ఎంఎల్ఏ జీవన్ రెడ్డి తన నియోజకవర్గంలోని ఓటర్లలో ఆసక్తి ఉన్నవారిని సొంత ఖర్చులతో యాదాద్రి దేవాలయానికి తీసుకెళ్ళారు. ఇదే విధమైన ప్లాన్ సిరిసిల్లలో కూడా జరుగుతోంది. సిరిసిల్లంటే అందరికీ తిలిసిందే మంత్రి కేటీయార్ నియోజకవర్గమని.
వీళ్ళిద్దరిని చూసి ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్ధులు కూడా టెంపుల్ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. సిరిసిల్ల నుండి ఏకంగా 14 బస్సుల్లో జనాలను యాదాద్రి ఆలయానికి తీసుకెళ్ళారు. 14 బస్సుల్లో తీసుకెళ్ళారంటే సుమారు 700 మందిని తీసుకెళ్ళినట్లు లెక్క. మొత్తంమీద యాదాద్రిలోని లోకల్ లీడర్లు సుమారుగా వెయ్యిమందికి దగ్గరుండి దర్శనాలు చేయించారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కూడా ఇలాంటి టెంపుల్ రాజకీయాలే చేశారు. ఇంకా చాలామంది అభ్యర్ధులు టెంపుల్ రాజకీయాలు మొదలుపెట్టబోతున్నారని సమాచారం.
అప్పట్లో జీవన్ రెడ్డి చేయించిన టెంపుల్ రాజకీయంపై పెద్ద దుమారమే రేగింది అయినా ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు సాధారణ ఎన్నికలకు ముందు అలాంటి టెంపుల్ రాజకీయాలే బీఆర్ఎస్ మళ్ళీ మొదలుపెట్టింది. నిజానికి జనాలను దేవాలయాలకు తీసుకెళ్ళినంతమాత్రాన ఏమిటి ఉపయోగమో తీసుకెళ్ళేవాళ్ళకే తెలియాలి. జనాలకు కావాల్సిన అవసరాలు తీర్చకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయచేసి దేవాలయాలకు తీసుకెళితే సరిపోతుందా ?
రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు. రుణమాఫీ కాకుండా మిగిలిపోయిన రైతుల సంఖ్య సుమారు 20 లక్షలు. అలాగే దళితబంధు, బీసీ బంధును అమలు చేయలేదు. మైనారిటీలకు రుణాలను అందించలేదు. ఎస్సీలకు 3 ఎకరాలను ఇవ్వలేదు. ఇవన్నీ స్వయంగా కేసీయార్ ఇచ్చిన హామీలే అని అందరికీ తెలుసు. రాబోయే ఎన్నికల్లో ఓటమిభయంతోనే హడావుడిగా రైతురుణమాఫీ అని కేసీయార్ డ్రామాలు మొదలుపెట్టారు. పైకి మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమపథకాలను అందిస్తున్న రాష్ట్రం దేశంమొత్తంమీద ఇలాంటిది లేనేలేదని ఊదరగొడతుంటారు. రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది ఎవరి బండారమేంటో.
This post was last modified on August 31, 2023 2:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…