ఎన్నికల్లో గెలుపుకోసం బీఆర్ఎస్ అభ్యర్ధులు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమపథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ఒకటే ఊదరగొడుతోంది. దీనికి అదనంగా సెంటిమెంటు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా జనాలను దేవాలయాలకు తీసుకెళుతున్నారు బీఆర్ఎస్ ఎంఎల్ఏల అభ్యర్ధులు. ఆర్మూరు ఎంఎల్ఏ జీవన్ రెడ్డి తన నియోజకవర్గంలోని ఓటర్లలో ఆసక్తి ఉన్నవారిని సొంత ఖర్చులతో యాదాద్రి దేవాలయానికి తీసుకెళ్ళారు. ఇదే విధమైన ప్లాన్ సిరిసిల్లలో కూడా జరుగుతోంది. సిరిసిల్లంటే అందరికీ తిలిసిందే మంత్రి కేటీయార్ నియోజకవర్గమని.
వీళ్ళిద్దరిని చూసి ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్ధులు కూడా టెంపుల్ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. సిరిసిల్ల నుండి ఏకంగా 14 బస్సుల్లో జనాలను యాదాద్రి ఆలయానికి తీసుకెళ్ళారు. 14 బస్సుల్లో తీసుకెళ్ళారంటే సుమారు 700 మందిని తీసుకెళ్ళినట్లు లెక్క. మొత్తంమీద యాదాద్రిలోని లోకల్ లీడర్లు సుమారుగా వెయ్యిమందికి దగ్గరుండి దర్శనాలు చేయించారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కూడా ఇలాంటి టెంపుల్ రాజకీయాలే చేశారు. ఇంకా చాలామంది అభ్యర్ధులు టెంపుల్ రాజకీయాలు మొదలుపెట్టబోతున్నారని సమాచారం.
అప్పట్లో జీవన్ రెడ్డి చేయించిన టెంపుల్ రాజకీయంపై పెద్ద దుమారమే రేగింది అయినా ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు సాధారణ ఎన్నికలకు ముందు అలాంటి టెంపుల్ రాజకీయాలే బీఆర్ఎస్ మళ్ళీ మొదలుపెట్టింది. నిజానికి జనాలను దేవాలయాలకు తీసుకెళ్ళినంతమాత్రాన ఏమిటి ఉపయోగమో తీసుకెళ్ళేవాళ్ళకే తెలియాలి. జనాలకు కావాల్సిన అవసరాలు తీర్చకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయచేసి దేవాలయాలకు తీసుకెళితే సరిపోతుందా ?
రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు. రుణమాఫీ కాకుండా మిగిలిపోయిన రైతుల సంఖ్య సుమారు 20 లక్షలు. అలాగే దళితబంధు, బీసీ బంధును అమలు చేయలేదు. మైనారిటీలకు రుణాలను అందించలేదు. ఎస్సీలకు 3 ఎకరాలను ఇవ్వలేదు. ఇవన్నీ స్వయంగా కేసీయార్ ఇచ్చిన హామీలే అని అందరికీ తెలుసు. రాబోయే ఎన్నికల్లో ఓటమిభయంతోనే హడావుడిగా రైతురుణమాఫీ అని కేసీయార్ డ్రామాలు మొదలుపెట్టారు. పైకి మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమపథకాలను అందిస్తున్న రాష్ట్రం దేశంమొత్తంమీద ఇలాంటిది లేనేలేదని ఊదరగొడతుంటారు. రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది ఎవరి బండారమేంటో.
This post was last modified on August 31, 2023 2:55 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…