Political News

ముందు తెలంగాణ, తర్వాతే ఏపీ..?

వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కొంతకాలం తెలంగాణకే పరిమితం కానున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. షర్మిల గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలుసుకున్నారు వారితో కలిసి అల్పాహారం విందు చేసి చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం బయటకు వచ్చిన షర్మిల విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆమె తెలంగాణకు పరిమితం అవుతారా, లేక ఆంధ్ర రాజకీయాల్లో కూడా కాలు పెడతారా అనే వాదనకు తెర లేపింది.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్లి రావటం, ఆమెకు మద్దతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం.. ఇవన్నీ కొంత చర్చకు దారి తీసింది. ఆ వెంటనే షర్మిల గజ్వేల్ కు బయలుదేరారు. తమకు దళిత బంధు అందడం లేదని కొందరు గ్రామస్తులు చెప్పడంతో ఆమె వెళ్ళడానికి సిద్ధం అవడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూడా ఆమె కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనంగా ఉంది. అక్కడ షర్మిలను వినియోగించు కోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. జగన్ వదిలిన బాణాన్ని ఆయనపైనే గురి పెట్టించడం కాంగ్రెస్ ఎత్తుగడ. కాగా మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత వచ్చే ఏడాది మేలో ఏపీలో ఎన్నికలు ఉంటాయి. ముందుగా జరిగే తెలంగాణ ఎన్నికల్లో షర్మిలను వినియోగించుకుని ఆ తర్వాత ఏపీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సమయం ఉంది కదా అని, తొందరపడి ఏపీ రాజకీయాలు గురించి షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం లేదని తెలుస్తోంది.

This post was last modified on August 31, 2023 2:34 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

19 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

1 hour ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago