Political News

మోడీ సర్కారు.. ఒక విప్లవాత్మక నిర్ణయం

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఇప్పటిదాకా ఉన్న గందరగోళం, అస్పష్టతకు తెరదించుతూ.. ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చింది. ఒక దేశం.. ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీల కోసం ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించాలని నిర్ణయించింది.

ఇందుకోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) పేరుతో కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేసింది. దీనికి యూపీఎస్సీ తరహాలో స్వయం ప్రతిపత్తి కూడా ఇస్తారు. దీనికి ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారిని నియమిస్తారు. దీని పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టు కింద ఏటా రెండుసార్లు నిర్వహించే పరీక్షల్లో సాధించే స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. స్కోర్ పెంచుకోవడం కోసం అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయొచ్చు. దరఖాస్తు చేసే ఉద్యోగం ఏదైనా అత్యుత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు 12 భాషల్లోనే జరుగుతుండగా.. ఈ టెస్టును మాత్రం రాజ్యాగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న భారతీయ భాషలన్నింట్లో నిర్వహిస్తారు. ఈ కొత్త విధానం వల్ల ఉద్యోగార్థులకు అనేక ప్రయోజనాలున్నాయి.

అన్ని పరీక్షలకు కలిపి ఒకేసారి నమోదు చేసుకోవచ్చు. వేర్వేరుగా ఫీజులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. సిలబస్ కూడా ఒకటే ఉంటుంది. పరీక్ష ఫలితాలు త్వరగా వెల్లడిస్తారు. నియామక కాలం కూడా తగ్గుతుంది. ఆన్ లైన్లోనే ఈ పరీక్ష జరుగుతుంది. సొంత జిల్లాలోనే పరీక్ష రాసుకునే సౌలభ్యం కలుగుతుంది.

This post was last modified on August 20, 2020 4:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

1 hour ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

3 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

4 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

5 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

5 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

7 hours ago