Political News

మోడీ సర్కారు.. ఒక విప్లవాత్మక నిర్ణయం

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఇప్పటిదాకా ఉన్న గందరగోళం, అస్పష్టతకు తెరదించుతూ.. ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చింది. ఒక దేశం.. ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీల కోసం ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించాలని నిర్ణయించింది.

ఇందుకోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) పేరుతో కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేసింది. దీనికి యూపీఎస్సీ తరహాలో స్వయం ప్రతిపత్తి కూడా ఇస్తారు. దీనికి ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారిని నియమిస్తారు. దీని పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టు కింద ఏటా రెండుసార్లు నిర్వహించే పరీక్షల్లో సాధించే స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. స్కోర్ పెంచుకోవడం కోసం అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయొచ్చు. దరఖాస్తు చేసే ఉద్యోగం ఏదైనా అత్యుత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు 12 భాషల్లోనే జరుగుతుండగా.. ఈ టెస్టును మాత్రం రాజ్యాగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న భారతీయ భాషలన్నింట్లో నిర్వహిస్తారు. ఈ కొత్త విధానం వల్ల ఉద్యోగార్థులకు అనేక ప్రయోజనాలున్నాయి.

అన్ని పరీక్షలకు కలిపి ఒకేసారి నమోదు చేసుకోవచ్చు. వేర్వేరుగా ఫీజులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. సిలబస్ కూడా ఒకటే ఉంటుంది. పరీక్ష ఫలితాలు త్వరగా వెల్లడిస్తారు. నియామక కాలం కూడా తగ్గుతుంది. ఆన్ లైన్లోనే ఈ పరీక్ష జరుగుతుంది. సొంత జిల్లాలోనే పరీక్ష రాసుకునే సౌలభ్యం కలుగుతుంది.

This post was last modified on August 20, 2020 4:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

4 hours ago

మెగా ఎఫెక్ట్‌.. క‌దిలిన ఇండ‌స్ట్రీ..!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక స‌మ‌రం.. ఓ రేంజ్‌లో హీటు పుట్టిస్తోంది. ప్ర‌ధాన ప‌క్షాలైన‌.. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు దూకుడుగా ముందుకు…

5 hours ago

చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు: రేవంత్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు. బుద్ధి…

5 hours ago

పవన్‌కు బంపర్ మెజారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…

6 hours ago

‘పుష్ప’తో నాకొచ్చిందేమీ లేదు-ఫాహద్

మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…

6 hours ago

సీనియర్ దర్శకుడిని ఇలా అవమానిస్తారా

సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…

8 hours ago