టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కీలక రికార్డును సొంతం చేసుకుంది. ఈ పాదయాత్రకు అప్పుడే 200 రోజులు పూర్తయ్యాయి. ఈ 200 రోజుల యాత్ర కూడా అలవోకగా సాగిపోవడం గమనార్హం. తొలినాళ్లలో అటు పోలీసుల నుంచి ఇటు ప్రత్యర్థి పార్టీల నుంచి కొంత ఇబ్బందులు ఎదురైనా.. తర్వాత తర్వాత యాత్ర సునాయాశంగానే ముందుకు సాగిపోయిందని చెప్పాలి.
సుదీర్ఘ లక్ష్యం
వచ్చే 2024 ఎన్నికల్లో విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా.. యువగళానికి టీడీపీ యువ నాయకుడు ప్రాణం పోశారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో అత్యంత ఆడంబరంగా ప్రారంభమైన పాదయాత్ర సీమ సహా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకుని నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్ల మేర పాదయాత్ర ముగిసింది.
4 వేల కిలో మీటర్లు..
మరో 1300 కిలో మీటర్ల మేరకు యువగళం పాదయాత్ర సాగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం.. మొత్తం 4 వేల కిలో మీటర్ల దూరాన్ని నారా లోకేష్ పూర్తి చేయాల్సి ఉంది. అదేసమయంలో 400 రోజులు అనుకున్నా.. ఇప్పటికే షెడ్యూల్లో పేర్కొన్న దానికన్నా వేగంగా పాదయాత్రను పూర్తి చేస్తున్న నేపథ్యంలో 350 రోజులకే యాత్ర ముగిసే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
బాబు విషెస్
యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యువనేత నారా లోకేష్కు టీడీపీ అధ్యిక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయ్యింది అని పేర్కొన్నారు. మున్ముందు మరింత ప్రజాదరణ పొందాలని అభిలషించారు.
This post was last modified on August 31, 2023 2:23 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…