Political News

యువ‌గ‌ళానికి 200 రోజులు.. యువ నేత ప్ర‌స్థానం!!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కీల‌క రికార్డును సొంతం చేసుకుంది. ఈ పాద‌యాత్రకు అప్పుడే 200 రోజులు పూర్త‌య్యాయి. ఈ 200 రోజుల యాత్ర కూడా అల‌వోక‌గా సాగిపోవ‌డం గ‌మనార్హం. తొలినాళ్ల‌లో అటు పోలీసుల నుంచి ఇటు ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి కొంత ఇబ్బందులు ఎదురైనా.. త‌ర్వాత త‌ర్వాత యాత్ర సునాయాశంగానే ముందుకు సాగిపోయింద‌ని చెప్పాలి.

సుదీర్ఘ ల‌క్ష్యం

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా.. యువ‌గ‌ళానికి టీడీపీ యువ నాయ‌కుడు ప్రాణం పోశారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత ఆడంబ‌రంగా ప్రారంభమైన పాదయాత్ర సీమ స‌హా నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకుని నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్ల మేర పాదయాత్ర ముగిసింది.

4 వేల కిలో మీట‌ర్లు..

మ‌రో 1300 కిలో మీట‌ర్ల మేర‌కు యువ‌గ‌ళం పాద‌యాత్ర సాగాల్సి ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం.. మొత్తం 4 వేల కిలో మీట‌ర్ల దూరాన్ని నారా లోకేష్ పూర్తి చేయాల్సి ఉంది. అదేస‌మ‌యంలో 400 రోజులు అనుకున్నా.. ఇప్ప‌టికే షెడ్యూల్లో పేర్కొన్న దానిక‌న్నా వేగంగా పాద‌యాత్ర‌ను పూర్తి చేస్తున్న నేప‌థ్యంలో 350 రోజుల‌కే యాత్ర ముగిసే అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

బాబు విషెస్‌

యువ‌గ‌ళం పాద‌యాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యువనేత నారా లోకేష్‌కు టీడీపీ అధ్యిక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయ్యింది అని పేర్కొన్నారు. మున్ముందు మ‌రింత ప్ర‌జాద‌ర‌ణ పొందాల‌ని అభిల‌షించారు.

This post was last modified on August 31, 2023 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago