టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కీలక రికార్డును సొంతం చేసుకుంది. ఈ పాదయాత్రకు అప్పుడే 200 రోజులు పూర్తయ్యాయి. ఈ 200 రోజుల యాత్ర కూడా అలవోకగా సాగిపోవడం గమనార్హం. తొలినాళ్లలో అటు పోలీసుల నుంచి ఇటు ప్రత్యర్థి పార్టీల నుంచి కొంత ఇబ్బందులు ఎదురైనా.. తర్వాత తర్వాత యాత్ర సునాయాశంగానే ముందుకు సాగిపోయిందని చెప్పాలి.
సుదీర్ఘ లక్ష్యం
వచ్చే 2024 ఎన్నికల్లో విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా.. యువగళానికి టీడీపీ యువ నాయకుడు ప్రాణం పోశారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో అత్యంత ఆడంబరంగా ప్రారంభమైన పాదయాత్ర సీమ సహా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకుని నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్ల మేర పాదయాత్ర ముగిసింది.
4 వేల కిలో మీటర్లు..
మరో 1300 కిలో మీటర్ల మేరకు యువగళం పాదయాత్ర సాగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం.. మొత్తం 4 వేల కిలో మీటర్ల దూరాన్ని నారా లోకేష్ పూర్తి చేయాల్సి ఉంది. అదేసమయంలో 400 రోజులు అనుకున్నా.. ఇప్పటికే షెడ్యూల్లో పేర్కొన్న దానికన్నా వేగంగా పాదయాత్రను పూర్తి చేస్తున్న నేపథ్యంలో 350 రోజులకే యాత్ర ముగిసే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
బాబు విషెస్
యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యువనేత నారా లోకేష్కు టీడీపీ అధ్యిక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయ్యింది అని పేర్కొన్నారు. మున్ముందు మరింత ప్రజాదరణ పొందాలని అభిలషించారు.
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…