రాజకీయ నేతలు ఎప్పుడు తడబడి మాట్లాడతారా.. ఎప్పుడు ట్రోలింగ్ చేద్దామా అని కొందరు కాచుకుని ఉంటారు. వారికి దొరికిపోయింది.. వైఎస్సార్ టీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. భేటీ అనంతరం బయటకు వచ్చిన షర్మిల విలేకరులతో మాట్లాడుతూ సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని తాను కలిసినట్లు చెప్పారు. ఇక్కడే ఆమె ట్రోలర్స్కు దొరికి పోయారు. వారంతో నెట్టింట్లో ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
ఇందిరాగాంధీతో కుదరలేదా తల్లీ.. అని ఒకరు సరదాగా ట్విట్టర్లో పశ్నిస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానంద రెడ్డి అందుబాటులో లేక కలవలేక పోవచ్చంటూ మరొకరు ట్వీట్ చేశారు. మా అక్కకి సంతోషం ఎక్కువ అంటూ ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇక మీమ్స్కైతే లెక్కేలేదు. గతంలోనూ రేవంత్రెడ్డి పాదయాత్రపై షర్మిల చేసిన వ్యాఖ్యలను తీసుకుని ఇన్స్టాలో ఔత్సాహికులు వందలకొద్దీ రీల్స్ చేశారు. ఇప్పుడు ఇలా దొరికిపోయారు. రాహుల్కు బదులుగా.. రాజీవ్ అని అన్నా.. ఈ ట్రోలర్స్ ఆగరు కదా మరి.
This post was last modified on August 31, 2023 1:32 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…