రాజకీయ నేతలు ఎప్పుడు తడబడి మాట్లాడతారా.. ఎప్పుడు ట్రోలింగ్ చేద్దామా అని కొందరు కాచుకుని ఉంటారు. వారికి దొరికిపోయింది.. వైఎస్సార్ టీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. భేటీ అనంతరం బయటకు వచ్చిన షర్మిల విలేకరులతో మాట్లాడుతూ సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని తాను కలిసినట్లు చెప్పారు. ఇక్కడే ఆమె ట్రోలర్స్కు దొరికి పోయారు. వారంతో నెట్టింట్లో ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
ఇందిరాగాంధీతో కుదరలేదా తల్లీ.. అని ఒకరు సరదాగా ట్విట్టర్లో పశ్నిస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానంద రెడ్డి అందుబాటులో లేక కలవలేక పోవచ్చంటూ మరొకరు ట్వీట్ చేశారు. మా అక్కకి సంతోషం ఎక్కువ అంటూ ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇక మీమ్స్కైతే లెక్కేలేదు. గతంలోనూ రేవంత్రెడ్డి పాదయాత్రపై షర్మిల చేసిన వ్యాఖ్యలను తీసుకుని ఇన్స్టాలో ఔత్సాహికులు వందలకొద్దీ రీల్స్ చేశారు. ఇప్పుడు ఇలా దొరికిపోయారు. రాహుల్కు బదులుగా.. రాజీవ్ అని అన్నా.. ఈ ట్రోలర్స్ ఆగరు కదా మరి.
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…