Political News

కేసీఆర్ కే బీఆర్ఎస్ ఎమ్మెల్యే డెడ్ లైన్

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేదు. ఆయన ఎంత చెబితే అంతా. నచ్చితే ఏ నాయకుడినైనా తలమీద ఎక్కించుకుంటారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేస్తారు. రెండో అవకాశం ఇవ్వడం, బెదిరింపులకు లొంగడం కేసీఆర్ కు తెలియదనే చెప్పాలి. అలాంటిది తాజాగా కేసీఆర్ కే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేనే డెడ్ లైన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయంతో మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకేసారి, అన్ని పార్టీల కంటే ముందుగానే 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. 7 చోట్ల సిట్టింగ్లకు మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ పై అసంత్రుప్తి వ్యక్తమవుతోంది. తాజాగా టికెట్ దక్కని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తానేమీ అక్రమాలు చేయలేదని, అన్యాయం చేయలేదని, ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు అమ్ముకున్నానని సుభాష్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడినైనా తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లానని, 23 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న తనకు కాదని ఏ సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోతున్నట్లు సుభాష్ చెప్పారు.

అంతే కాకుండా వారం రోజుల్లో టికెట్ పై కేసీఆర్ పునరాలోచన చేయకుంటే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని డెడ్ లైన్ విధించడం గమనార్హం. ఈ సారి సుభాష్ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన బండారు లక్ష్మారెడ్డికి ఉప్పల్ టికెట్ను కేసీఆర్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న సుభాష్ ను కేసీఆర్ ఎలా దారికి తెచ్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 

This post was last modified on August 31, 2023 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

49 minutes ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

7 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

7 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

9 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

9 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

10 hours ago