బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేదు. ఆయన ఎంత చెబితే అంతా. నచ్చితే ఏ నాయకుడినైనా తలమీద ఎక్కించుకుంటారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేస్తారు. రెండో అవకాశం ఇవ్వడం, బెదిరింపులకు లొంగడం కేసీఆర్ కు తెలియదనే చెప్పాలి. అలాంటిది తాజాగా కేసీఆర్ కే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేనే డెడ్ లైన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయంతో మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకేసారి, అన్ని పార్టీల కంటే ముందుగానే 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. 7 చోట్ల సిట్టింగ్లకు మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ పై అసంత్రుప్తి వ్యక్తమవుతోంది. తాజాగా టికెట్ దక్కని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తానేమీ అక్రమాలు చేయలేదని, అన్యాయం చేయలేదని, ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు అమ్ముకున్నానని సుభాష్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడినైనా తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లానని, 23 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న తనకు కాదని ఏ సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోతున్నట్లు సుభాష్ చెప్పారు.
అంతే కాకుండా వారం రోజుల్లో టికెట్ పై కేసీఆర్ పునరాలోచన చేయకుంటే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని డెడ్ లైన్ విధించడం గమనార్హం. ఈ సారి సుభాష్ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన బండారు లక్ష్మారెడ్డికి ఉప్పల్ టికెట్ను కేసీఆర్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న సుభాష్ ను కేసీఆర్ ఎలా దారికి తెచ్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 31, 2023 10:41 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…