Political News

కోడి కత్తికి బొత్స మేనల్లుడికి లింకేంటి?

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడిగకత్తితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన శ్రీనివాసరావు దాదాపుగా ఐదేళ్లుగా బెయిల్ కూడా లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, ఈ కేసులో విచారణకు రావాలని సీఎం జగన్ ను విజయవాడలోని ఎన్ ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య ఈ కేసు విశాఖకు బదిలీ అయింది.

ఈ నేపథ్యంలోనే ఈ కేసులో జగన్ ఎన్వోసీ ఇవ్వాలని కోరుతూ దళిత సంఘాలు విశాఖలో నిరసన చేపట్టేందుకు కొద్దిరోజులు క్రితం ప్రయత్నించాయి. కానీ ఆ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు మొదలు కాకముందే భగ్నం చేశారు. నిరసన చేపట్టడానికి ముందే వారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు కోడి కత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు అని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. శ్రీనివాస్ కు కోడి కత్తిని అందించింది బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అని నిందితుడు శ్రీనివాసరావు న్యాయవాది సలీం ఆరోపణలు చేశారు. ఈ కేసులో విచారణకు జగన్ హాజరు కావడం లేదని, ఆయన హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని, కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉందని సలీం ఆరోపించారు. ఈ విషయాన్ని గతంలోనే ఎన్ ఐఏ  చెప్పిందని సలీం గుర్తు చేశారు.

This post was last modified on August 31, 2023 6:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయమ్మ లాజిక్ తో జగన్ కు కఫ్టమే

వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…

15 minutes ago

రెడ్ బుక్ వ‌ద‌ల‌: మ‌రోసారి లోకేష్ స్ప‌ష్టం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌నిచేస్తోంద‌ని ఆరోపించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే టీడీపీ యువ‌నాయ‌కుడు,…

1 hour ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే ఎలా

సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…

5 hours ago

కబుర్లన్నీ చెప్పి ఇదేంటి అమీర్ సాబ్

ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…

8 hours ago

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు – జగన్

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…

11 hours ago

థ్యాంక్స్ మోదీజీ: మధుసూదన్ భార్య కామాక్షి!

పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…

12 hours ago