Political News

కోడి కత్తికి బొత్స మేనల్లుడికి లింకేంటి?

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడిగకత్తితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన శ్రీనివాసరావు దాదాపుగా ఐదేళ్లుగా బెయిల్ కూడా లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, ఈ కేసులో విచారణకు రావాలని సీఎం జగన్ ను విజయవాడలోని ఎన్ ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య ఈ కేసు విశాఖకు బదిలీ అయింది.

ఈ నేపథ్యంలోనే ఈ కేసులో జగన్ ఎన్వోసీ ఇవ్వాలని కోరుతూ దళిత సంఘాలు విశాఖలో నిరసన చేపట్టేందుకు కొద్దిరోజులు క్రితం ప్రయత్నించాయి. కానీ ఆ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు మొదలు కాకముందే భగ్నం చేశారు. నిరసన చేపట్టడానికి ముందే వారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు కోడి కత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు అని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. శ్రీనివాస్ కు కోడి కత్తిని అందించింది బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అని నిందితుడు శ్రీనివాసరావు న్యాయవాది సలీం ఆరోపణలు చేశారు. ఈ కేసులో విచారణకు జగన్ హాజరు కావడం లేదని, ఆయన హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని, కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉందని సలీం ఆరోపించారు. ఈ విషయాన్ని గతంలోనే ఎన్ ఐఏ  చెప్పిందని సలీం గుర్తు చేశారు.

This post was last modified on August 31, 2023 6:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

5 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

7 hours ago