2019 ఎన్నికల సమయంలో గోరంట్ల మాధవ్ అంటే పెద్ద సంచలనం. అంతకుముందు జిల్లాలోని తాడిపత్రిలో ఒక ఆశ్రమం గొడవల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి మీసం మెలేసి తొడకొట్టారు. జేసీ బ్రదర్స్ అంటే వణికిపోయే అధికారులను జనాలు చూశారే కానీ వాళ్ళకే చాలెంజ్ విసిరి మీసం మెలేసి తొడలు కొట్టిన అధికారిని అందులోను పోలీసు అధికారిని జనాలు ఎప్పుడూ చూసిందిలేదు. దాంతో మీడియా, సోషల్ మీడియాతో పాటు జనాల్లో మాధవ్ అంటే హీరో ఇమేజి వచ్చేసింది.
అప్పుడే జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాచ్ చేసి మాధవ్ కు హిందూపురం ఎంపీగా టికెట్ ఇచ్చారు. ఇంకేముంది వైసీపీ గాలికి మాధవ్ ఇమేజి తోడై మంచి మెజారిటితో గెలిచారు. అంటే మాధవ్ చాలంజ్ విసరటం, ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఎంపీగా పోటీ చేయడం, గెలవటం అంతా సంచలనమే. అలాంటిది నాలుగేళ్ళు తిరిగేసరికి సంచలనం కాస్త కలలాగ కరిగిపోయింది. ఇపుడు మాధవ్ గురించి పెద్దగా జనాలు మాట్లాడుకోవటంలేదు. ఎంపీ కూడా జనాల్లో ఎక్కడా కనబడటం లేదు.
కారణం ఏమిటంటే ఎంపీగా గెలిచిన దగ్గర నుండి అనేక వివాదాల్లో కూరుకుపోవటమే. వివాదాలు సరిపోవన్నట్లుగా ఒక మహిళతో న్యూడ్ కాల్ లో మాధవ్ మాట్లాడారనే వీడియో చాలా వైరల్ అయ్యింది. అది నిజమో కాదో ఎవరికీ తెలీదు. వీడియో కాల్ ఫేక్ అని మాధవ్ అంటున్నారు. వీడియోలో కనిపించింది తాను కాదని సదరు మహిళ కూడా చెప్పింది. కదిరి పోలీసుస్టేషన్ లో టీడీపీ నేతలపై ఫిర్యాదు కూడా చేసింది. నిజమైనా అబద్ధమైనా ఆ వీడియో ఎంపీని బాగా డ్యామేజి చేసిందన్నది నిజం.
దాంతో రేపటి ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలుస్తారా అనే సందేహం పార్టీలో పెరిగిపోతోంది. అందుకనే ఎంపీగా పోటీచేయరు కర్నూలు జిల్లాలో ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కొంతకాలంగా ఆ ప్రచారం కూడా ఆగిపోయింది. మొత్తం మీద ఎంపీ మాధవ్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిందన్నది వాస్తవం. రాజకీయాల్లో అలా ఒకసారి మెరిసి మాయమైపోతారమో చూడాలి.
This post was last modified on August 31, 2023 6:15 am
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…