Political News

మోడీ ప్రభుత్వంపై మండిపోయిన సుప్రీంకోర్టు

నరేంద్రమోడీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపోయింది. జమ్మూ-కాశ్మీర్ విషయమై కేంద్రప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను రద్దుచేసి ఎంతకాలం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచుకుంటారో చెప్పాలంటు నిలదీసింది. అసలు ఏ అధికారంతో, ఏ కారణంగా రాష్ట్ర హోదాను రద్దుచేశారో చెప్పాలని ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన కేసును సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసం విచారించింది.

దాదాపు నాలుగేళ్ళ క్రితం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి మిత్రమే పరిమితమైన ఆర్టికల్ 370 ని మోడీ ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. పార్లమెంటులో బిల్లుపెట్టి చర్చలు జరిగి తర్వాత ఓటింగ్ ద్వారా బిల్లును చట్టం రూపంలోకి మార్చింది ప్రభుత్వం. అప్పటినుండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మ-కాశ్మీర్-లడ్దాఖ అనే మూడు ప్రాంతాలుగా విడదీసింది. మూడింటిపైనా కేంద్రప్రభుత్వానికే తాత్కాలిక అధికారాలు ఉండేట్లుగా నిర్ణయించింది. అయితే ఆ ఏర్పాటు ఎంతకాలమో చెప్పలేదు. ఎప్పటికప్పుడు తొందరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని మాత్రమే చెబుతోంది.

ఇదే విషయాన్ని చీఫ్ జస్టిస్ డైరెక్టుగా కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రప్రభుత్వ హోదాను రద్దుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దేనికైనా ఒక పరిమితి ఉటుందని కానీ కేంద్రప్రభుత్వం అన్నీ పరిమితులను దాటేస్తోందని తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రహోదాను రద్దుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలంటే అందుకు కొన్ని పరిమితులు ఉంటాయని కేంద్రం మరచిపోయినట్లుందని గుర్తుచేసింది. అందుకనే ఎప్పటిలోగా మళ్ళీ రాష్ట్ర హోదాను కల్పిస్తారో చెప్పాలని నిలదీసింది.

చీఫ్ జస్టిస్ ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం లాయర్ బాగా ఇబ్బంది పడ్దారు. ఏ ప్రశ్నకైనా ఒకటే సమాధానం. అదేమిటంటే కేంద్రం పరిశీలనలో ఉందని..తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని. దీనిమీద కూడా చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. జమ్మూ-కాశ్మీర్ కు ఎన్నికలు జరుగుతాయా జరగవా చెప్పమని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలు జరిపే ఉద్దేశ్యం కేంద్రానికి ఉందా లేదా స్పష్టంగా చెప్పమని అడ్వకేట్ జనరల్ ను చీఫ్ జస్టిస్ నిలదీశారు. దాంతో రెండు మూడు రోజుల్లో కేంద్రం ఈ అంశంపై ఒక ప్రకటన చేస్తుందని చెప్పి సమస్య నుండి గట్టెక్కారు. 

This post was last modified on August 30, 2023 3:47 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

57 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago