Political News

ఎన్టీఆర్ ను చంపిన వారితో నాణెం విడుదలా?:లక్ష్మీ పార్వతి

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే, ఎన్టీఆర్ భార్య హోదాలో తనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని రాష్ట్రపతి ముర్ముకు వైసీపీ నేత లక్ష్మీపార్వతి లేఖ కూడా రాశారు. అయినా సరే, ఈ కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ భార్యనైన తనను ఈ కార్యక్రమానికి పిలవకపోవడం అన్యాయమని, ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్ళు ఆయన వారసులుగా చలామణి అవుతున్నారని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేయడం సంతోషంగా ఉందని, అదే సమయంలో తనను పిలవకపోవడం బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా తనను పిలవకపోవడం తప్పు అని అన్నారు. ఎన్టీఆర్ భార్యగా ఆ నాణెం అందుకునే అర్హత తనకు ఉందని, వాళ్లకు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇకపై తన పోరాటం పురందేశ్వరిపైనే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులని, కూతుళ్లు భువనేశ్వరి, పురందేశ్వరి దుర్మార్గులని సంచలన వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి తిరిగిన ప్రతి నియోజకవర్గంలో తాను తిరిగి ఒక్క సీటు కూడా రాకుండా ప్రచారం చేస్తానని సవాల్ విసిరారు. వారి గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానని అన్నారు. ఎన్టీఆర్ కు బయట చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, అంతర్గతంగా పురందేశ్వరి పొడిచారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రావద్దు అని ఆమెతో ఎన్టీఆర్ అన్నందుకే ఆయ పై పురందేశ్వరి కుట్ర చేసిందని సంచలన ఆరోపణలు చేశారు.

తండ్రిపై కోపంతో ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లిందని ఆరోపించారు. ఎన్టీఆర్ భార్యనని తాను మెడలో బోర్డు పెట్టుకుని తిరగాలా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తో పెళ్లి అయినట్టు ఫోటోలు, వార్తా కథనాలు, సాక్ష్యాలు ఉన్నాయని, ఆయన ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. కానీ, తనపై మాత్రం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో ఇన్నాళ్లు నోరు మెదపలేదని, ఇకపై వారిని వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.

చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటికి లాగుతానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్ళు రాజకీయాల్లో లేకుండా చేస్తానని, తనకంటే ఎక్కువ అవమానానికి గురయ్యాలా పురందేశ్వరిని చేస్తానని శపథం చేశారు. ఎన్టీఆర్ కి భారత రత్న రాకుండా చేశారని ఆరోపించారు. తన లేఖలకు సమాధానం రాలేదని, ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లను కలుస్తానని అన్నారు.

This post was last modified on August 28, 2023 10:56 pm

Share

Recent Posts

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

2 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

4 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

4 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

6 hours ago

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

7 hours ago