ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు టీడీపీ ఎంపీలు వ్యవహార శైలి అంతుచిక్కని విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేతతో కలిసి తిరుగుతున్న ఆ ఎంపీలు.. ఆ నాయకుడి కొడుకును మాత్రం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ ఎంపీలే కేశినేని నాని, గల్లా జయదేవ్. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక వంద రూపాయాల నాణెం విడుదల కార్యక్రమం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేశినేని నాని, గల్లా జయదేవ్తో పాటు మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు బాబుకు స్వాగతం పలకడం దగ్గర నుంచి పక్కనే ఉండి అన్నీ చూసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ ను మాత్రం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని పట్టించుకోలేదని టాక్. తమ లోక్సభ నియోజకవర్గాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర సాగిన ఈ ఇద్దరు ఎంపీలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు లోకేష్ పాదయాత్ర సంగతే తెలియదన్నట్లు ఉండిపోయారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఈ ఇద్దరిపై ఆగ్రహంతో ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి.
కానీ ఇప్పుడు ఢిల్లీలో చూస్తేనేమో ఈ ఇద్దరితో బాబు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్ తో పాటు ఆయన వర్గం కూడా దీనిపై కాస్త అసహనంతో ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి కేశినేని నాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నా బాబు ఎలాంటి చర్య తీసుకోలేదని టాక్. మరోవైపు గల్లా జయదేవ్ సొంత వ్యాపారాలకే పరిమితమయ్యారనే అభిప్రాయాలున్నాయి. కానీ వీళ్లిద్దరి పట్ల బాబు ఏనాడూ కోపం ప్రదర్శించలేదని టాక్. మరోవైపు లోకేష్ వ్యవహార శైలి పట్ల నాని, గల్లా అంసత్రుప్తితో ఉన్నారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…