Political News

లోకేష్ తో కటీఫ్.. బాబుతో దోస్తీ

ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు టీడీపీ ఎంపీలు వ్యవహార శైలి అంతుచిక్కని విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేతతో కలిసి తిరుగుతున్న ఆ ఎంపీలు.. ఆ నాయకుడి కొడుకును మాత్రం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ ఎంపీలే కేశినేని నాని, గల్లా జయదేవ్. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక వంద రూపాయాల నాణెం విడుదల కార్యక్రమం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేశినేని నాని, గల్లా జయదేవ్తో పాటు మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు బాబుకు స్వాగతం పలకడం దగ్గర నుంచి పక్కనే ఉండి అన్నీ చూసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ ను మాత్రం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని పట్టించుకోలేదని టాక్. తమ లోక్సభ నియోజకవర్గాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర సాగిన ఈ ఇద్దరు ఎంపీలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు లోకేష్ పాదయాత్ర సంగతే తెలియదన్నట్లు ఉండిపోయారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఈ ఇద్దరిపై ఆగ్రహంతో ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి.

కానీ ఇప్పుడు ఢిల్లీలో చూస్తేనేమో ఈ ఇద్దరితో బాబు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్ తో పాటు ఆయన వర్గం కూడా దీనిపై కాస్త అసహనంతో ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి కేశినేని నాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నా బాబు ఎలాంటి చర్య తీసుకోలేదని టాక్. మరోవైపు గల్లా జయదేవ్ సొంత వ్యాపారాలకే పరిమితమయ్యారనే అభిప్రాయాలున్నాయి. కానీ వీళ్లిద్దరి పట్ల బాబు ఏనాడూ కోపం ప్రదర్శించలేదని టాక్. మరోవైపు లోకేష్ వ్యవహార శైలి పట్ల నాని, గల్లా అంసత్రుప్తితో ఉన్నారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. 

This post was last modified on August 28, 2023 9:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

16 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago