Political News

లోకేష్ తో కటీఫ్.. బాబుతో దోస్తీ

ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు టీడీపీ ఎంపీలు వ్యవహార శైలి అంతుచిక్కని విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేతతో కలిసి తిరుగుతున్న ఆ ఎంపీలు.. ఆ నాయకుడి కొడుకును మాత్రం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ ఎంపీలే కేశినేని నాని, గల్లా జయదేవ్. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక వంద రూపాయాల నాణెం విడుదల కార్యక్రమం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేశినేని నాని, గల్లా జయదేవ్తో పాటు మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు బాబుకు స్వాగతం పలకడం దగ్గర నుంచి పక్కనే ఉండి అన్నీ చూసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ ను మాత్రం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని పట్టించుకోలేదని టాక్. తమ లోక్సభ నియోజకవర్గాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర సాగిన ఈ ఇద్దరు ఎంపీలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు లోకేష్ పాదయాత్ర సంగతే తెలియదన్నట్లు ఉండిపోయారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఈ ఇద్దరిపై ఆగ్రహంతో ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి.

కానీ ఇప్పుడు ఢిల్లీలో చూస్తేనేమో ఈ ఇద్దరితో బాబు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్ తో పాటు ఆయన వర్గం కూడా దీనిపై కాస్త అసహనంతో ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి కేశినేని నాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నా బాబు ఎలాంటి చర్య తీసుకోలేదని టాక్. మరోవైపు గల్లా జయదేవ్ సొంత వ్యాపారాలకే పరిమితమయ్యారనే అభిప్రాయాలున్నాయి. కానీ వీళ్లిద్దరి పట్ల బాబు ఏనాడూ కోపం ప్రదర్శించలేదని టాక్. మరోవైపు లోకేష్ వ్యవహార శైలి పట్ల నాని, గల్లా అంసత్రుప్తితో ఉన్నారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. 

This post was last modified on August 28, 2023 9:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఎన్నిక‌.. షెడ్యూల్ విడుద‌ల‌!

ఏపీలో కీల‌క‌మైన ఓ రాజ్య‌స‌భ సీటు ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా షెడ్యూల్ ప్ర‌క‌టించింది. వైసీపీ నుంచి…

3 minutes ago

ప్రేమకథతో తిరిగి వస్తున్న బుట్టబొమ్మ

డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…

11 minutes ago

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

1 hour ago

పెద్ది గురించి శివన్న….హైప్ పెంచేశాడన్నా

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…

1 hour ago

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…

3 hours ago

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…

4 hours ago