Political News

ఆ భేటీలో ఏపీని కేసీఆర్ కడిగేస్తారా?

అందరి కోపం వేరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోపం వేరుగా చెబుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చెప్పే ఆయన.. అంతో ఇంతో తమ రాష్ట్రానికి మేలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంటుంది.

తన రాష్ట్రం విషయంలో సీఎం కేసీఆర్ కు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ ఉంటుందో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సైతం అలాంటి వైఖరే ఉంటుందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోవటమే అసలు సమస్యగా చెబుతారు.

గతంలో తాను ప్రతిపాదించిన ప్రాజెక్టును జగన్ నో చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలకు సంబంధించిన పంచాయితీ చోటు చేసుకున్నది తెలిసిందే. ఎవరికి వారు.. వారి రాష్ట్రాల ప్రయోజనాల గురించే తప్పించి.. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల గురించి పెద్ద పట్టింపులు లేనట్లుగా కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా..ఈ నెల 25న రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వైఖరిని స్పష్టం చేయటంతో పాటు.. ఏపీ సర్కారు చేస్తున్న తప్పుల్నిఎత్తి చూపాలన్న విషయాన్ని అధికారులకు సీఎం కేసీఆర్ క్లియర్ గా చెప్పినట్లుగా చెబుతున్నారు. అపెక్స్ కమిటీ భేటీ సందర్భంగా రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్ని రీడిజైన్ చేసినవే తప్పించి.. కొత్తగా తెర మీదకు తీసుకొచ్చినవేమీ లేవన్న విషయాన్ని బలంగా చెప్పటమే కాదు.. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బట్టబయలు చేయాలన్న కోపంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంపుతో పాటు.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపైన గట్టిగా అభ్యంతరం చెప్పాలన్న విషయాన్ని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. అపెక్సు కౌన్సిల్ సమావేశంలో ఏపీ తీరును కడిగేయాలన్న కోపంలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. అందుకు సరైన కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా ఏపీ సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ ప్లాన్ కు జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

This post was last modified on August 20, 2020 1:11 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

58 mins ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

2 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

3 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

4 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

4 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

5 hours ago