చికోటి ప్రవీణ్…పేరు తెలియని వారుండరు. మనిషిని నేరుగా చూడకపోవచ్చు, పరిచయం కూడా లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు వార్తలను ఫాలో అయ్యేవాళ్ళకి చికోటి ప్రవీణ్ అనే పేరు చాలా పరిచయటమనే చెప్పాలి. చికోటి పేరు ఎలాగ పరిచయం ఉంటుందంటే గ్యాంబ్లింగ్ నిర్వాహకుడిగా. దేశ, విదేశాల్లో కాసినో నిర్వాహకుడిగా, గ్యాంబ్లింగ్ మాస్టర్ గా సమాజంలో చికోటి చాలా పాపులర్. అలాంటి చికోటి రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయబోతున్నారట.
ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించలేదు కానీ చికోటియే ప్రకటించేసుకున్నారు. తాను ఎక్కడనుండి పోటీచేసేది కూడా ప్రకటించేశారు. జహీరాబాద్ ఎంపీగా కానీ లేకపోతే ఎల్బీనగర్ ఎంఎల్ఏగా కానీ బీజేపీ తరపున పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. కామారెడ్డిలోని బిక్కనూరులో ఒక దేవాలయంలో పూజలు చేసిన సమయంలో చికోటి తన పోటీపై క్లారిటి ఇచ్చారు. చికోటికి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఎందుకంటే అభ్యర్ధుల కొరతతో పార్టీ నానా అవస్తలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయటాని అన్నీచోట్లా గట్టి అభ్యర్ధులు లేరన్నవిషయం అందరకీ తెలుసు. అసెంబ్లీలకే గట్టి అభ్యర్ధులు దొరకకపోతే ఇక పార్లమెంటుకు ఎక్కడ దొరుకుతారు. ఈ పాయింట్ మీదే చికోటి లాంటి వాళ్ళ బీజేపీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈమధ్యనే చికోటి ఢిల్లీకి వెళ్ళి బండి సంజయ్, డీకే అరుణలతో భేటీ అయ్యారు. చికోటికి టికెట్ ఇస్తే అడ్వాంటేజ్ ఉంది.
అదేమిటంటే ఎన్నికల ఖర్చుల కింద చికోటికీ పార్టీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలేదు. బహుశా చికోటియే పార్టీకి ఎదురు డబ్బులు ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే ప్రచారంలో బీజేపీ నేతలకన్నా చికోటి మద్దతుదారులే ఎక్కువగా ఉంటారేమో. బీజేపీకి నేతలుంటారో లేదో తెలీదు కానీ చికోటికి ఊరూ వాడా ఫుల్లుగా మద్దతుదారులు, అభిమానులు ఉండచ్చు. బీజేపీ అభ్యర్ధులకు ప్రత్యేకంగా ప్రచారం అవసరం. కానీ చికోటికి అసలు ప్రచారమే అవసరంలేదు. అవసరమైతే తాను క్యాసినోలను నడిపిన నేపాల్, శ్రీలంక, రష్యా, థాయ్ ల్యాండ్ నుండి కూడా ప్రచారానికి వచ్చేస్తారేమో. మరి చికోటి విషయంలో బీజేపీ ఏమంటుందో చూడాలి.
This post was last modified on August 28, 2023 2:25 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…