చికోటి ప్రవీణ్…పేరు తెలియని వారుండరు. మనిషిని నేరుగా చూడకపోవచ్చు, పరిచయం కూడా లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు వార్తలను ఫాలో అయ్యేవాళ్ళకి చికోటి ప్రవీణ్ అనే పేరు చాలా పరిచయటమనే చెప్పాలి. చికోటి పేరు ఎలాగ పరిచయం ఉంటుందంటే గ్యాంబ్లింగ్ నిర్వాహకుడిగా. దేశ, విదేశాల్లో కాసినో నిర్వాహకుడిగా, గ్యాంబ్లింగ్ మాస్టర్ గా సమాజంలో చికోటి చాలా పాపులర్. అలాంటి చికోటి రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయబోతున్నారట.
ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించలేదు కానీ చికోటియే ప్రకటించేసుకున్నారు. తాను ఎక్కడనుండి పోటీచేసేది కూడా ప్రకటించేశారు. జహీరాబాద్ ఎంపీగా కానీ లేకపోతే ఎల్బీనగర్ ఎంఎల్ఏగా కానీ బీజేపీ తరపున పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. కామారెడ్డిలోని బిక్కనూరులో ఒక దేవాలయంలో పూజలు చేసిన సమయంలో చికోటి తన పోటీపై క్లారిటి ఇచ్చారు. చికోటికి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఎందుకంటే అభ్యర్ధుల కొరతతో పార్టీ నానా అవస్తలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయటాని అన్నీచోట్లా గట్టి అభ్యర్ధులు లేరన్నవిషయం అందరకీ తెలుసు. అసెంబ్లీలకే గట్టి అభ్యర్ధులు దొరకకపోతే ఇక పార్లమెంటుకు ఎక్కడ దొరుకుతారు. ఈ పాయింట్ మీదే చికోటి లాంటి వాళ్ళ బీజేపీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈమధ్యనే చికోటి ఢిల్లీకి వెళ్ళి బండి సంజయ్, డీకే అరుణలతో భేటీ అయ్యారు. చికోటికి టికెట్ ఇస్తే అడ్వాంటేజ్ ఉంది.
అదేమిటంటే ఎన్నికల ఖర్చుల కింద చికోటికీ పార్టీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలేదు. బహుశా చికోటియే పార్టీకి ఎదురు డబ్బులు ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే ప్రచారంలో బీజేపీ నేతలకన్నా చికోటి మద్దతుదారులే ఎక్కువగా ఉంటారేమో. బీజేపీకి నేతలుంటారో లేదో తెలీదు కానీ చికోటికి ఊరూ వాడా ఫుల్లుగా మద్దతుదారులు, అభిమానులు ఉండచ్చు. బీజేపీ అభ్యర్ధులకు ప్రత్యేకంగా ప్రచారం అవసరం. కానీ చికోటికి అసలు ప్రచారమే అవసరంలేదు. అవసరమైతే తాను క్యాసినోలను నడిపిన నేపాల్, శ్రీలంక, రష్యా, థాయ్ ల్యాండ్ నుండి కూడా ప్రచారానికి వచ్చేస్తారేమో. మరి చికోటి విషయంలో బీజేపీ ఏమంటుందో చూడాలి.
This post was last modified on August 28, 2023 2:25 pm
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…