చికోటి ప్రవీణ్…పేరు తెలియని వారుండరు. మనిషిని నేరుగా చూడకపోవచ్చు, పరిచయం కూడా లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు వార్తలను ఫాలో అయ్యేవాళ్ళకి చికోటి ప్రవీణ్ అనే పేరు చాలా పరిచయటమనే చెప్పాలి. చికోటి పేరు ఎలాగ పరిచయం ఉంటుందంటే గ్యాంబ్లింగ్ నిర్వాహకుడిగా. దేశ, విదేశాల్లో కాసినో నిర్వాహకుడిగా, గ్యాంబ్లింగ్ మాస్టర్ గా సమాజంలో చికోటి చాలా పాపులర్. అలాంటి చికోటి రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయబోతున్నారట.
ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించలేదు కానీ చికోటియే ప్రకటించేసుకున్నారు. తాను ఎక్కడనుండి పోటీచేసేది కూడా ప్రకటించేశారు. జహీరాబాద్ ఎంపీగా కానీ లేకపోతే ఎల్బీనగర్ ఎంఎల్ఏగా కానీ బీజేపీ తరపున పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. కామారెడ్డిలోని బిక్కనూరులో ఒక దేవాలయంలో పూజలు చేసిన సమయంలో చికోటి తన పోటీపై క్లారిటి ఇచ్చారు. చికోటికి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఎందుకంటే అభ్యర్ధుల కొరతతో పార్టీ నానా అవస్తలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయటాని అన్నీచోట్లా గట్టి అభ్యర్ధులు లేరన్నవిషయం అందరకీ తెలుసు. అసెంబ్లీలకే గట్టి అభ్యర్ధులు దొరకకపోతే ఇక పార్లమెంటుకు ఎక్కడ దొరుకుతారు. ఈ పాయింట్ మీదే చికోటి లాంటి వాళ్ళ బీజేపీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈమధ్యనే చికోటి ఢిల్లీకి వెళ్ళి బండి సంజయ్, డీకే అరుణలతో భేటీ అయ్యారు. చికోటికి టికెట్ ఇస్తే అడ్వాంటేజ్ ఉంది.
అదేమిటంటే ఎన్నికల ఖర్చుల కింద చికోటికీ పార్టీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలేదు. బహుశా చికోటియే పార్టీకి ఎదురు డబ్బులు ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే ప్రచారంలో బీజేపీ నేతలకన్నా చికోటి మద్దతుదారులే ఎక్కువగా ఉంటారేమో. బీజేపీకి నేతలుంటారో లేదో తెలీదు కానీ చికోటికి ఊరూ వాడా ఫుల్లుగా మద్దతుదారులు, అభిమానులు ఉండచ్చు. బీజేపీ అభ్యర్ధులకు ప్రత్యేకంగా ప్రచారం అవసరం. కానీ చికోటికి అసలు ప్రచారమే అవసరంలేదు. అవసరమైతే తాను క్యాసినోలను నడిపిన నేపాల్, శ్రీలంక, రష్యా, థాయ్ ల్యాండ్ నుండి కూడా ప్రచారానికి వచ్చేస్తారేమో. మరి చికోటి విషయంలో బీజేపీ ఏమంటుందో చూడాలి.
This post was last modified on August 28, 2023 2:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…