Political News

అమలు చేసిన 99 శాతం హామీలేంటి? : చంద్రబాబు!

ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ కూడా ఒక దాని మీద ఒక విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పై విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా నియమించిన పాలక మండలి పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు సభ్యుల నియామకం అనేది సరైన పద్ధతిలో జరగలేదని ఆయన దుయ్యబట్టారు. ”లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉండి..తరువాత అప్రూవర్‌ గా మారిన వ్యక్తి ఇప్పుడు మీకు మంచి వ్యక్తి అయ్యాడా? అలాంటి వ్యక్తిని ఎలా సభ్యునిగా నియామిస్తారని” ఆయన ప్రశ్నించారు.

జగన్‌ చేస్తున్న ఈ తప్పును ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకుంటున్నారు. వారు నెరవేర్చిన 99 శాతం హామీలు ఏంటి అనేది ప్రజలకు వివరించాలన్నారు. అధికారంలోకి రావడంతోనే ఉచిత విద్యుత్‌ గురించి రైతులను ఇబ్బంది పెట్టారు. తరువాత కరెంట్‌ ఛార్జీలు పెంచి సామాన్యులను ఇబ్బంది పెట్టారు.

అన్నిటికంటే ముఖ్యమైనది ఇసుక దోపిడీ..ఇదివరకటి రోజుల్లో బకాసురులు ఉంటే..ఇప్పుడు జగన్‌ రాజ్యంలో ఇసుకాసురులు ఉన్నారు. ఇసుక దోపిడీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. అందరికీ అందుబాటులోకి రావాల్సిన పోలవరాన్ని గోదాట్లో ముంచేశారని విమర్శించారు.

మూడు రాజధానులంటూ ఆటలు ఆడారు. కనీసం ఏపీ ప్రజలకు రాజధాని ఏది అంటే ఇది అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఒక్క ఇండస్ట్రీ లేదు.. ఒక్కరికీ ఉద్యోగం లేదు. కానీ జగన్ అండ్ కంపెనీ అందర్నీ దోచుకుని.. తిరుగులేని విధంగా తయారైంది.” అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on August 27, 2023 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago