రాజకీయాల్లో విజేతలకు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఓడిపోయినవారు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు వార్నింగ్లు ఇస్తే వీధికుక్కలు కూడా భయపడవని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు.
వివిధ జాతీయ సర్వేలలో వైసీపీ గెలుస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే దీనిపై పచ్చమీడియా సొంత కథనాలు వండీవారుస్తోందని విజయసాయి నిప్పులు చెరిగారు.
ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ పచ్చ మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని, మరి ఇండియా టుడే టీవీ సర్వే మాత్రమే అసలు సిసలు సర్వే అంటూ ఊదరగొడుతోందని పేర్కొన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితేనే ఒరిజినల్, లేకపోతే ఫేకా? అని ఆయన ప్రశ్నించారు.
పరాజితులు, ఒకప్పటి రౌడీ షీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని విమర్శలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామనే ధీమా తెలుగుదేశం పార్టీలో ఒక్కడికీ లేదన్నారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…