Political News

‘ఏపీ అంతా జగన్ కంచుకోటే’

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ బలానికి సర్పంచ్ ఎన్నికే నిదర్శనమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.రానున్న రోజుల్లో కుప్పంలో ఎమ్మెల్యే సీటు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఏపీ రాష్ట్రం అంతా సీఎం జగన్ కు కంచుకోటేనని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

జగన్ తప్ప 99 శాతం హామీలను పూర్తి చేసిన సీఎం ఎవరూ లేరని చెప్పారు.సీఎం జగన్ తమకు మేలు చేశారని ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు.హిందూపురంలో దీపిక విజయం కోసం నేతలు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎన్నికల లోపు కనీసం రెండు, మూడు సార్లు హిందూపురంలో పర్యటించాలని సీఎం జగన్ ను కోరతామని వెల్లడించారు. నకిలీ ఓటర్ల బాగోతాన్ని త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

రాష్ట్రంలో 3 కోట్ల 90 లక్షల ఓట్లు ఉండగా.. అందులో 60 లక్షలు నకిలీవేనని ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. 2018-2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఓటర్ల జాబితాలో చేర్చారని అన్నారు. వాటిమీద చర్యలు తీసుకుంటూ ఉంటే తమ ఓట్లను తీసేస్తోన్నారంటూ టీడీపీ నాయకులు వితండవాదంతో అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ 60 లక్షల దొంగఓట్లను కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్తామని తేల్చి చెప్పారు.

This post was last modified on August 25, 2023 9:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago