చంద్రబాబు నారా లోకేష్ ని కనాలనుకోలేదు, కానీ చంద్రబాబుకి లోకేష్ పుట్టారు. అదొక బయలాజికల్ యాక్సిడెంట్ మినహా ఇంకేమీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన తండ్రి చిన్న ఉద్యోగి అని, తాను కష్టపడి సినీరంగంలోకి వచ్చి స్థిరపడ్డానని చెప్పుకొచ్చారు. తన విజయాలు, నారా లోకేష్ విజయాలు పక్క పక్కనపెట్టి చూస్తామన్నారు. థర్డ్ గ్రేడ్ డైరెక్టర్ అంటూ తనపై లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు వర్మ.
ఇటీవల రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా షూటింగ్ ప్రకాశం బ్యారేజ్ పై జరిగింది. వర్మ సినిమాకు పర్మిషన్ ఇస్తారు కానీ, తన పాదయాత్రకు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని నారా లోకేష్ ఓ ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆయన ఓ థర్డ్ గ్రేడ్ సినిమాలు చేసే డైరెక్టర్ అంటూ సెటైర్లు పేల్చారు. ఆసెటైర్లకు వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అసలు లోకేష్ పుట్టుక ఓ బయలాజికల్ యాక్సిడెంట్ అని అన్నారు.
నారా లోకేష్ తెలియని అభద్రతా భావంలో ఉన్నారని ఎద్దేవా చేశారు వర్మ. పవన్ సభలకు జనం వస్తున్నారని, తన సభలకు రాలేదనే భయంలో లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. తన సినిమాతోపాటు రోజూ వివిధ ప్రాంతాల్లో వివిధ సినిమాల షూటింగ్ లు జరుగుతుంటాయని, సినిమా షూటింగ్ లకు, రాజకీయ సభలకు ఇచ్చే పర్మిషన్లను ఒకేగాటన ఎలా కడతారంటూ ప్రశ్నించారు వర్మ. షూటింగ్ పర్మిషన్ కు, మీటింగ్ పర్మిషన్ కు మధ్య సంబంధమేంటన్నారు.
ఓ వ్యూహం ప్రకారం రాజకీయ లబ్ధికోసం నారా లోకేష్ తనపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పులేదన్నారు వర్మ. ఆయన ఆ అజెండాతో కాకుండా.. అదే నిజమనే భ్రమలో మాట్లాడితే మాత్రం అర్జంట్ గా ఆయన సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. నిజంగానే లోకేష్ అమాయకుడా, లేక జనం అమాయకులు అనుకొని మాట్లాడతారా అని ప్రశ్నించారు వర్మ.
This post was last modified on August 25, 2023 6:56 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…