టీడీపీ నేతల పై కేసులు పెట్టడం పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నారా లోకేశ్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలంటే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలని అన్నారు. చంద్రబాబును కాల్చి చంపాలని, ఉరి వేయాలని, చీపుర్లతో తరమాలని, కాలర్ పట్టుకుని నిలదీయాలని జగన్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని… రెచ్చగొట్టే వ్యాఖ్యలంటే అవి అని చెప్పారు.
గన్నవరం యువగళం సభలో తాను, తమ టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామంటూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
తన తల్లిని అవమానించిన వాళ్లు, మరొకరి తల్లిని అవమానించకుండా బుధ్ది చెపుతానని అనడం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతాయా? అని ప్రశ్నించారు. ప్రజాకంటక పాలకులను ప్రశ్నించే బాధ్యతను టీడీపీ తీసుకోవడం నేరం అవుతుందా? అని అడిగారు. .
This post was last modified on August 25, 2023 6:53 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…