తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ కన్నేశారు. విజయం సాధించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టాలని చూశారు. అలాగే ఎన్నికలకు ముందు పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు, నేతల మధ్య దూరం ఉండకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు వివిధ వర్గాలను ఆకట్టకునే ప్రయత్నంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా అందరికీ వరాలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నర్తో దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలను కేసీఆర్ మొదలెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ గవర్నర్గా తమిళి సై వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఆమెను దూరం పెడుతున్నారనే టాక్ ఉంది. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు కూడా. మరోవైపు బిల్లుల పెండింగ్ కారణంగా కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అనేలా పరిస్థితి మారిందనే చెప్పాలి. రాజ్ భవన్లో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ఇన్ని రోజులు కేసీఆర్ వెళ్లలేదు. మరోవైపు కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఇప్పటివరకూ గవర్నర్ సందర్శించలేదు.
కానీ ఎన్నికలకు ముందు గవర్నర్తో గొడవ ఎందుకని కేసీఆర్ తగ్గారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం రాజ్ భవన్కు కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. అంతే కాకుండా సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ను కేసీఆర్ ఆహ్వానించగా.. అందుకు ఆమె ఒప్పుకున్నారు. ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి కేసీఆర్తో కలిసి హాజరయ్యారు. అంతే కాకుండా ఆ తర్వాత సచివాలయాన్ని కూడా గవర్నర్ పరిశీలించారు.
This post was last modified on August 25, 2023 2:37 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…