Political News

ఎన్నికల ముందు ఎందుకని? కేసీఆర్ తగ్గారా?

తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ కన్నేశారు. విజయం సాధించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టాలని చూశారు. అలాగే ఎన్నికలకు ముందు పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు, నేతల మధ్య దూరం ఉండకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు వివిధ వర్గాలను ఆకట్టకునే ప్రయత్నంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా అందరికీ వరాలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నర్తో దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలను కేసీఆర్ మొదలెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ గవర్నర్గా తమిళి సై వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఆమెను దూరం పెడుతున్నారనే టాక్ ఉంది. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు కూడా. మరోవైపు బిల్లుల పెండింగ్ కారణంగా కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అనేలా పరిస్థితి మారిందనే చెప్పాలి. రాజ్ భవన్లో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ఇన్ని రోజులు కేసీఆర్ వెళ్లలేదు. మరోవైపు కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఇప్పటివరకూ గవర్నర్ సందర్శించలేదు.

కానీ ఎన్నికలకు ముందు గవర్నర్తో గొడవ ఎందుకని కేసీఆర్ తగ్గారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం రాజ్ భవన్కు కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. అంతే కాకుండా సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ను కేసీఆర్ ఆహ్వానించగా.. అందుకు ఆమె ఒప్పుకున్నారు. ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి కేసీఆర్తో కలిసి హాజరయ్యారు. అంతే కాకుండా ఆ తర్వాత సచివాలయాన్ని కూడా గవర్నర్ పరిశీలించారు.

This post was last modified on August 25, 2023 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

9 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago