Political News

ఎన్నికల ముందు ఎందుకని? కేసీఆర్ తగ్గారా?

తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ కన్నేశారు. విజయం సాధించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టాలని చూశారు. అలాగే ఎన్నికలకు ముందు పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు, నేతల మధ్య దూరం ఉండకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు వివిధ వర్గాలను ఆకట్టకునే ప్రయత్నంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా అందరికీ వరాలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నర్తో దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలను కేసీఆర్ మొదలెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ గవర్నర్గా తమిళి సై వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఆమెను దూరం పెడుతున్నారనే టాక్ ఉంది. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు కూడా. మరోవైపు బిల్లుల పెండింగ్ కారణంగా కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అనేలా పరిస్థితి మారిందనే చెప్పాలి. రాజ్ భవన్లో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ఇన్ని రోజులు కేసీఆర్ వెళ్లలేదు. మరోవైపు కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఇప్పటివరకూ గవర్నర్ సందర్శించలేదు.

కానీ ఎన్నికలకు ముందు గవర్నర్తో గొడవ ఎందుకని కేసీఆర్ తగ్గారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం రాజ్ భవన్కు కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. అంతే కాకుండా సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ను కేసీఆర్ ఆహ్వానించగా.. అందుకు ఆమె ఒప్పుకున్నారు. ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి కేసీఆర్తో కలిసి హాజరయ్యారు. అంతే కాకుండా ఆ తర్వాత సచివాలయాన్ని కూడా గవర్నర్ పరిశీలించారు.

This post was last modified on August 25, 2023 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

35 minutes ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

1 hour ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

3 hours ago

కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…

4 hours ago

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

5 hours ago