Political News

శ్రీదేవిని పక్కనపెట్టాల్సిందే.. టీడీపీ నేతల నుంచే డిమాండ్

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు జరిగేలా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే కారణంతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించిన శ్రీదేవి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఆమె చర్చించారు. అంతే కాకుండా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా అమరావతిలో శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే టాక్ ఉంది.

కానీ వైసీపీ నుంచి వచ్చిన శ్రీదేవికి బాబు, లోకేష్ ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ నాయకులకు రుచించడం లేదని తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా శ్రీదేవిని పోటీ చేయించాలని బాబు చూస్తున్నట్లు టాక్. కానీ ఆ సీటు ఆశిస్తున్న పనబాక లక్ష్మీ తదితరులు అధిష్ఠానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఓడిపోయే అవకాశం ఉన్న తిరుపతి లోక్ సభ స్థానాన్ని తనకిస్తూ.. రాజకీయ స్వార్థం చూసుకుంటున్న శ్రీదేవిని బాపట్లలో నిలబెట్టాలనుకోవడం సరికాదని పనబాక లక్ష్మీ కోపంతో ఊగిపోతున్నారని టాక్.

అమరావతి నుంచి రాజధాని తరలించాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన శ్రీదేవి.. ఇప్పుడు సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ పక్షాన చేరారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పని చేసే అవకాశమే లేదని చెబుతున్నట్లు కూడా తెలిసింది. ఏది ఏమైనా శ్రీదేవిని పక్కన పెట్టాల్సిందేనన్న టీడీపీ నేతల డిమాండ్లు ఎక్కువవుతున్నాయని సమాచారం.

This post was last modified on August 25, 2023 2:42 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago