తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు జరిగేలా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే కారణంతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించిన శ్రీదేవి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఆమె చర్చించారు. అంతే కాకుండా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా అమరావతిలో శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే టాక్ ఉంది.
కానీ వైసీపీ నుంచి వచ్చిన శ్రీదేవికి బాబు, లోకేష్ ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ నాయకులకు రుచించడం లేదని తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా శ్రీదేవిని పోటీ చేయించాలని బాబు చూస్తున్నట్లు టాక్. కానీ ఆ సీటు ఆశిస్తున్న పనబాక లక్ష్మీ తదితరులు అధిష్ఠానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఓడిపోయే అవకాశం ఉన్న తిరుపతి లోక్ సభ స్థానాన్ని తనకిస్తూ.. రాజకీయ స్వార్థం చూసుకుంటున్న శ్రీదేవిని బాపట్లలో నిలబెట్టాలనుకోవడం సరికాదని పనబాక లక్ష్మీ కోపంతో ఊగిపోతున్నారని టాక్.
అమరావతి నుంచి రాజధాని తరలించాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన శ్రీదేవి.. ఇప్పుడు సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ పక్షాన చేరారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పని చేసే అవకాశమే లేదని చెబుతున్నట్లు కూడా తెలిసింది. ఏది ఏమైనా శ్రీదేవిని పక్కన పెట్టాల్సిందేనన్న టీడీపీ నేతల డిమాండ్లు ఎక్కువవుతున్నాయని సమాచారం.
This post was last modified on August 25, 2023 2:42 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…