తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు జరిగేలా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే కారణంతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించిన శ్రీదేవి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఆమె చర్చించారు. అంతే కాకుండా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా అమరావతిలో శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే టాక్ ఉంది.
కానీ వైసీపీ నుంచి వచ్చిన శ్రీదేవికి బాబు, లోకేష్ ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ నాయకులకు రుచించడం లేదని తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా శ్రీదేవిని పోటీ చేయించాలని బాబు చూస్తున్నట్లు టాక్. కానీ ఆ సీటు ఆశిస్తున్న పనబాక లక్ష్మీ తదితరులు అధిష్ఠానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఓడిపోయే అవకాశం ఉన్న తిరుపతి లోక్ సభ స్థానాన్ని తనకిస్తూ.. రాజకీయ స్వార్థం చూసుకుంటున్న శ్రీదేవిని బాపట్లలో నిలబెట్టాలనుకోవడం సరికాదని పనబాక లక్ష్మీ కోపంతో ఊగిపోతున్నారని టాక్.
అమరావతి నుంచి రాజధాని తరలించాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన శ్రీదేవి.. ఇప్పుడు సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ పక్షాన చేరారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పని చేసే అవకాశమే లేదని చెబుతున్నట్లు కూడా తెలిసింది. ఏది ఏమైనా శ్రీదేవిని పక్కన పెట్టాల్సిందేనన్న టీడీపీ నేతల డిమాండ్లు ఎక్కువవుతున్నాయని సమాచారం.
This post was last modified on August 25, 2023 2:42 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…