రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కాకపోతే ఒంటరి పోటీ అన్నది ఏపీలో కాదు తెలంగాణ లో మాత్రమే. తెలంగాణలో షెడ్యూల్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగాల్సుంది. ఇందుకు అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో చాలా బిజీగా ఉంటున్నాయి. 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఇదే పద్దతిలో టీడీపీ కూడా అభ్యర్ధులను ఫైనల్ చేయబోతోందంటు ప్రచారం మొదలైపోయింది.
మొదటి జాబితాగా 30 మంది అభ్యర్థుల పేర్లు కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు లేదా తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజే చెప్పాలి. సరే జాబితాలోని పేర్లు, నియోజకవర్గాల మాట ఎలా ఉన్నా ఒంటరి పోటీ అయితే దాదాపు ఖాయమన్నట్లే. ఇప్పటికే కాసాని మీడియాతో మాట్లాడినపుడల్లా టీడీపీ ఒంటరి పోటీకి రెడీ అవుతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు.
ఇందులో భాగంగానే ఖమ్మం, నిజామాబాద్, కుకట్ పల్లి, నిజాంపేట, ఎల్బీనగర్ లాంటి అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే విషయమై ఒకటికి రెండుసార్లు సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఇదే సమయంలో గట్టి అభ్యర్థులను కూడా రెడీ చేస్తున్నారు. ఒక లెక్క ప్రకారం చూస్తే ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి సాలిడ్ గా సగటున 5 వేల ఓట్లుంటాయి. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఇంకా ఎక్కువ ఓట్లే ఉంటాయి.
నిజానికి ఉన్న ఓట్లతో టీడీపీ ఎక్కడా గెలవదని అందరికీ తెలుసు. అయితే టీడీపీ గెలవకపోయినా ప్రత్యర్ధుల్లో ఎవరో ఒకళ్ళ ఓటమికి మాత్రం కారణమవుతుంది. ఈ విషయంలోనే మిగిలిన పార్టీలు టీడీపీ ఓటుబ్యాంకుపై కన్నేశాయి. అలాగని టీడీపీతో పొత్తుకు ఏ పార్టీ కూడా ముందుకు రావటంలేదు. ఒకపుడు బీజేపీతో టీడీపీకి పొత్తుంటుందనే ప్రచారం జరిగినా తర్వాత ఎందుకో అది ముందుకు వెళ్ళలేదు. దాంతో ఇపుడా విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలోనే టీడీపీ ఒంటరిపోటీకి రెడీ అయిపోతోందనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతోంది. మరి చంద్రబాబు ఏమి చెబుతారో చూడాలి.
This post was last modified on August 25, 2023 1:42 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…