ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. మరోవైపు మెడపై అనర్హత కేసులున్నాయి.. మరి ప్రచారం ఎలా?.. ఇది ఇప్పుడు బీఆర్ఎస్లోని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారానికి తెరలేపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రచారంలో ఇబ్బందులు తప్పవేమోనని కొంతమంది ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారని తెలిసింది.
ఇప్పటికే కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ.. అక్కడ జలగం వెంగల్రావే ఎమ్మెల్యే అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వనమాకు కేసీఆర్ మరోసారి టికెట్ కేటాయించారు. ఇక గత ఎన్నికల వేళ అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదవడంతో పాటు ఆయన కోర్టు విచారణ ఎదుర్కుంటున్నారు. కానీ మరోసారి అతనికే మహబూబ్ నగర్ టికెట్ దక్కింది. తాజాగా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు పేర్కొంది. కానీ ఇప్పటికే కేసీఆర్ ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చారు.
మరోవైపు పౌరసత్వం వివాదం కారణంగా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు టికెట్ దక్కలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మర్రి జనార్ధన్, గూడెం మహిపాల్ రెడ్డిపై ఎన్నికల పిటిషన్లు కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి ప్రచారంలో వెళ్తే ఈ కేసులను ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థి పార్టీలు రెచ్చిపోయే అవకాశముంది. కేసులు ఉన్న నాయకులకు ఎలా ఓట్లు వేస్తారంటూ ప్రశ్నించే ఆస్కారముంది. అందుకే ముందుగానే ప్రత్యర్థి వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని తెలిసింది.
This post was last modified on August 25, 2023 1:46 pm
మాములుగా ఈ స్టేట్ మెంట్ పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఫలానా నటుడు స్టార్ కావడానికి ఒక దర్శకుడు కారణమనే…
పెద్ది మార్చి నుంచి తప్పుకుని ఏప్రిల్ చివరికి వెళ్ళిపోయాక మూవీ లవర్స్ దృష్టి ప్యారడైజ్ వైపు వెళ్తోంది. వాయిదా కన్ఫర్మ్…
‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు అనుదీప్. అందులో అతను పండించిన కొత్త రకం కామెడీకి ఈ…
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…