వంగవీటి రాధాకృష్ణ ఏమి చేయబోతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాధా ఆలోచనలు ఏమిటనే విషయం ఎవరికీ అంతుబట్టడంలేదు. ఒకసారి జనసేన అదినేత పవన్ కల్యాణ్ తో ఏకాంతంగా భేటీ అవుతారు. మరోసారి వైసీపీ ఎంఎల్ఏ కొడాలి నానీతో సమావేశమవుతారు. దీంతో రాధా రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉందనిపిస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తో రాధా భేటీ అయ్యారు. గన్నవరం నియోజకవర్గంలోని బావులపాడులో లోకేష్ తో రాధా దాదాపు అర్ధగంట మాట్లాడారు.
ఏమి మాట్లాడారు అన్నది తెలీలేదు. చాలాకాలంగా టీడీపీలో రాధా ఎక్కడా కనబడటంలేదు. ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం కనబడరు. అలాంటిది లోకేష్ పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ఎంటరైనపుడు ప్రకాశం బ్యారేజీ దగ్గర స్వాగతం పలికిన నేతల్లో రాధా కూడా ఉన్నారు. లోకేష్ తో పాటు రాధా కూడా కొంచెం దూరం నడిచారు. తర్వాత మూడురోజులు ఎక్కడా కనబడలేదు. అలాంటిది సడెన్ గా బావులపాడు ఏరియాలో ప్రత్యక్షమయ్యారు.
కొంతకాలంగా రాధా జనసేనలో చేరుతారు అనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకసారి పవన్ తో ను మరోసారి నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. దాంతో రాధా జనసేనలో చేరటం ఖాయమైపోయిందనే ప్రచారం పెరిగిపోయింది. ఇక్కడ రాధా సమస్య ఏమిటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలి. అయితే టీడీపీలో అది సాధ్యంకాదు. ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ ఇక్కడ బలమైన అభ్యర్ధిగా ఉన్నారు.
అందుకనే పార్టీమారి జనసేనలో చేరితే తప్ప విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీకి అవకాశం రాదని ఆలోచిస్తున్నట్లున్నారు. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే పొత్తులో సెంట్రల్ నియోజకవర్గాన్ని పవన్ తీసుకుని అక్కడ తనకు టికెట్ ఇస్తారని బహుశా రాధా అనుకుంటున్నట్లున్నారు. అయితే అది జరగటానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ టీడీపీకి స్ట్రాంగ్ సీటని అందరికీ తెలిసిందే. ఈ సీటును వదులుకోవటానికి చంద్రబాబు ఎంతవరకు అంగీకరిస్తారో తెలీదు. బహుశా ఆ విషయం మాట్లాడటానికే లోకేష్ తో రాధా భేటీ అయివుంటారని అనుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on August 25, 2023 1:41 pm
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…