Political News

పవన్‌ వచ్చే వరకు అంతేనా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీలో పర్యటించిన సందర్భం మినహా.. మిగిలిన సమయంలో ఆ పార్టీ స్తబ్దు ఉటుందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత వచ్చినపుడేనా.. మిగిలిన సందర్భాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే కార్యక్రమాల రూపకల్పన ఏది అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రెండు నెలల నుంచి వారాహి యాత్ర పేరుతో పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో విస్త`తంగా పర్యటించారు. మూడు విడతల ఆయన యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో వైజాగ్‌ను కవర్‌ చేశారు. ఆ సమయంలో పతాక స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలతో పత్రికలు నిండిపోయాయి. అదే విధంగా న్యూస్‌ చానళ్లలోనూ ప్రైమ్‌ టైంలో చర్చలు జరిగాయి. అయితే వారాహి వాహనంపై కూడా పవన్‌ వన్‌మ్యాన్‌ షోలా వ్వహరించారని విమర్శలు కూడా వచ్చాయి. యాత్రలో భాగంగా చేపట్టిన జనవాణి కార్యక్రమంలో మాత్రమే కొందరు ఇతర పార్టీ నాయకులు కనిపించారు. ఏదేమైనా వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిందనే రాజకీయ విశ్లేషకులు భావించారు.

వైజాగ్‌ పర్యటనతో వారాహి మూడో విడత యాత్ర ముగిసింది. ఆ తర్వాత ఆయన షూటింగ్‌లకు వెళ్లాడని సమాచారం. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి నవంబరు నెల నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిసింది. అయితే.. అప్పటి వరకు క్యాడర్‌ స్తబ్దుగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై ఉంది. మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి నిమిషం కీలకం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అన్నిచోట్ల వారాహి యాత్రను విజయవంతం చేస్తున్న జనసైనికులు, వీర మహిళలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఈ సమయాన్ని ఎలా వినియోగిస్తారో వేచి చూడాలి..?

This post was last modified on August 24, 2023 3:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

53 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

2 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

5 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

6 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

6 hours ago