Political News

కామ్రేడ్‌.. మరి ఏపీలో పొత్తు ఎవరితో?

తెలంగాణాలో కామ్రేడ్‌లకు కేసీఆర్‌ షాకివ్వడంతో ఒక్కసారిగా వారంతా ఖంగుతిన్నారు. నాగార్జున సాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో వారంతా కారు వెంట నడిచారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత వారిని పక్కన పెట్టడంతో వారి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. పొత్తులో భాగంగా కనీసం నాలుగు సీట్లయినా తీసుకుని అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న వారికి ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. దీంతో వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే వామపక్షాలు ఒంటరిగా పోటీచేస్తే ఓట్ల చీలిక తమకు లాభం చేకూరుస్తుందనేది కేసీఆర్‌ భావనగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఆంధ్రాల్లో కామ్రేడ్ల దారెటు.. అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇంతవరకు బహిరంగంగా ప్రకటించకపోయినా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక`ష్ణ, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వైసీపీ ప్రభుత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఇదే పార్టీతో పొత్తు నడిపించిన జనసేన ఇప్పుడు దూరమైంది. ఆ తర్వాత బీజేపీతో పొత్తు కొనసాగిస్తోంది. తమకు దూరమైన జనసేన, అదేవిధంగా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్న టీడీపీ.. ఈ రెండూ రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని నారాయణ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, టీడీపీ కలిసి వస్తాయని జనసేన అధినేత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ వామపక్షాల మాటెత్తడం లేదు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలను మిగిలిన పార్టీలు పక్కన పెడుతున్నాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ రెండు పార్టీలకు కొంత క్యాడర్‌ ఉందనేది వాస్తవం. ఏదో ఒక పార్టీ పంచన చేరి ఆ బలాన్ని చూపించి ఒకటో రెండో సీట్లు తెచ్చుకుని తమ ప్రాభవాన్ని నిలుపుకోవాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. కానీ రెండు రాష్ట్రాలలో పరిస్థితి గమనిస్తే ఎవరు కూడా ఆ పార్టీలను తమ పంచన చేరనిచ్చేటట్లు లేరు. తెలంగాణాలో ప్రస్తుతం కూడలిలో నిలుచున్న వామపక్షాలు.. ఆంధ్రాల్లో ఎటువైపు నడుస్తాయో చూడాలి.

This post was last modified on August 25, 2023 11:16 am

Share

Recent Posts

రామాయ‌ణం.. ర‌ణ‌బీర్… ర‌బ్బ‌ర్ చెప్పులు

పురాణ గాథ‌ల‌ను తెర‌కెక్కించేట‌పుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విష‌యం…

51 minutes ago

జ‌గ‌న్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. తొలుత…

57 minutes ago

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…

1 hour ago

దర్శకుడు చనిపోయినా సినిమా బ్రతుకుతోంది

ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…

1 hour ago

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…

2 hours ago

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

5 hours ago