Political News

రేసులో వెనుకబడ్డ బీజేపీ

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైందనే చెప్పాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ రాజేశారు. అంతే కాకుండా ముందుగానే నాలుగు మినహా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్, బీజేపీని మానసికంగా కేసీఆర్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికలకు తాము సిద్ధమని బీఆర్ఎస్ సంకేతాలు పంపించింది. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీనే.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ ముందుకు సాగుతున్నాయి. కానీ ఈ రెండు ప్రత్యర్థి పార్టీల్లో చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ ముందుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పాటు ఆ ప్రక్రియను పార్టీ మొదలెట్టింది. ఇప్పటికే దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ దక్కని నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఖానాపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు ఉన్నారు. వీళ్లు తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యచరణ కోసం ఆలోచిస్తున్నారు. వీళ్లను కాంగ్రెస్లోకి లాగేందుకు రేవంత్ అండ్ టీమ్ పనిచేస్తోందని తెలిసింది. కానీ బీజేపీ మాత్రం ఇంకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అడుగు వేయడం లేదని అంటున్నారు. అభ్యర్థుల గురించి నివేదిక సమర్పించే బాధ్యతను ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు అప్పగించడం మినహా ఆ పార్టీది ఏం చప్పుడు లేదని టాక్.

This post was last modified on August 24, 2023 1:23 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

53 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago