Political News

రేసులో వెనుకబడ్డ బీజేపీ

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైందనే చెప్పాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ రాజేశారు. అంతే కాకుండా ముందుగానే నాలుగు మినహా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్, బీజేపీని మానసికంగా కేసీఆర్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికలకు తాము సిద్ధమని బీఆర్ఎస్ సంకేతాలు పంపించింది. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీనే.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ ముందుకు సాగుతున్నాయి. కానీ ఈ రెండు ప్రత్యర్థి పార్టీల్లో చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ ముందుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పాటు ఆ ప్రక్రియను పార్టీ మొదలెట్టింది. ఇప్పటికే దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ దక్కని నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఖానాపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు ఉన్నారు. వీళ్లు తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యచరణ కోసం ఆలోచిస్తున్నారు. వీళ్లను కాంగ్రెస్లోకి లాగేందుకు రేవంత్ అండ్ టీమ్ పనిచేస్తోందని తెలిసింది. కానీ బీజేపీ మాత్రం ఇంకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అడుగు వేయడం లేదని అంటున్నారు. అభ్యర్థుల గురించి నివేదిక సమర్పించే బాధ్యతను ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు అప్పగించడం మినహా ఆ పార్టీది ఏం చప్పుడు లేదని టాక్.

This post was last modified on August 24, 2023 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…

7 minutes ago

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…

1 hour ago

విశాఖ‌కు మ‌హ‌ర్ద‌శ‌.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు!

ప్ర‌స్తుతం ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌ప‌ట్నానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. తాజాగా విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన అనేక కీల‌క ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని…

5 hours ago

‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…

8 hours ago

అతి చెత్త స్కోరుతో గెలిచి చూపించిన పంజాబ్

ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…

8 hours ago

నాగ్ అశ్విన్‌ను డిప్రెషన్లోకి నెట్టిన ‘ఇన్సెప్షన్’

డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…

8 hours ago