నారా లోకేష్ గన్నవరం వేదికగా వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీల మీద విరుచుకుపడ్డారు. ఈ విషయం గురించి వైసీపీనేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఆయన మండిపడ్డారు. దమ్ముంటే లోకేష్ గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు.
చంద్రబాబుకి తన కొడుకుని పెంచడం చేత కాలేదని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకునే పెద్ద మనిషి కొడుకు సంస్కారహీనంగా పెరిగాడని పేర్కొన్నారు. లోకేష్ నిర్వహిస్తున్న యాత్ర పేరు యువ గళం కాదు..యువగంగాళం అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు పేర్లు మార్చి టీడీపీ వాళ్లు చెబుతున్నారని అన్నారు.
జగన్ ప్రజలకు ఏమి చేస్తాను అనేది ఎన్నికల సమయంలో వివరించారు.అదే అధికారంలోకి రాగానే చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు గన్నవరం ఎమ్మెల్యే వంశీని పశువుల డాక్టర్ అంటున్నారు. ఆయన మీ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చారు. మరి ఆ సమయంలో ఆయనేమన్నా మనుషుల డాక్టర్..దేవతలా డాక్టర్ గా ఉన్నారా అని ప్రశ్నించారు.
కొడాలి నాని కూడా టీడీపీలో ఉన్న సమయంలో ఏమైనా ఇన్ఫోసిస్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారా అని ప్రశ్నిచారు, ఆయన ఒక మంత్రిగా చేశారు.ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.అలాంటి వ్యక్తిని పట్టుకుని లారీ క్లీనర్..కప్పులు కడిగేవాడు అని పేర్కొనడం ఏమి బాగాలేదు అని ఆయన అన్నారు.
తండ్రీ కొడుకులకు ఆవగింజంత సిగ్గు, దోస గింజంత ఆత్మాభిమానం ఉంటే గుడివాడలో మీ అభ్యర్ధి ఎవరో చెప్పాలని పేర్ని నిలదీశారు. బట్టలూడదీసి చూసే అలవాటు ఏమిటన్నారు.
This post was last modified on August 23, 2023 5:32 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…