Political News

గుడివాడలో పోటీ చేసి గెలిచే దమ్ముందా? : పేర్ని నాని!

నారా లోకేష్‌ గన్నవరం వేదికగా వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీల మీద విరుచుకుపడ్డారు. ఈ విషయం గురించి వైసీపీనేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఆయన మండిపడ్డారు. దమ్ముంటే లోకేష్‌ గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు.

చంద్రబాబుకి తన కొడుకుని పెంచడం చేత కాలేదని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకునే పెద్ద మనిషి కొడుకు సంస్కారహీనంగా పెరిగాడని పేర్కొన్నారు. లోకేష్‌ నిర్వహిస్తున్న యాత్ర పేరు యువ గళం కాదు..యువగంగాళం అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు పేర్లు మార్చి టీడీపీ వాళ్లు చెబుతున్నారని అన్నారు.

జగన్ ప్రజలకు ఏమి చేస్తాను అనేది ఎన్నికల సమయంలో వివరించారు.అదే అధికారంలోకి రాగానే చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు గన్నవరం ఎమ్మెల్యే వంశీని పశువుల డాక్టర్ అంటున్నారు. ఆయన మీ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చారు. మరి ఆ సమయంలో ఆయనేమన్నా మనుషుల డాక్టర్‌..దేవతలా డాక్టర్ గా ఉన్నారా అని ప్రశ్నించారు.

కొడాలి నాని కూడా టీడీపీలో ఉన్న సమయంలో ఏమైనా ఇన్ఫోసిస్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నారా అని ప్రశ్నిచారు, ఆయన ఒక మంత్రిగా చేశారు.ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.అలాంటి వ్యక్తిని పట్టుకుని లారీ క్లీనర్..కప్పులు కడిగేవాడు అని పేర్కొనడం ఏమి బాగాలేదు అని ఆయన అన్నారు.

తండ్రీ కొడుకులకు ఆవగింజంత సిగ్గు, దోస గింజంత ఆత్మాభిమానం ఉంటే గుడివాడలో మీ అభ్యర్ధి ఎవరో చెప్పాలని పేర్ని నిలదీశారు. బట్టలూడదీసి చూసే అలవాటు ఏమిటన్నారు.

This post was last modified on August 23, 2023 5:32 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…

3 mins ago

కల్కి పబ్లిసిటీకి పక్కా ప్రణాళికలు

ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…

2 hours ago

దేవర హుకుమ్ – అనిరుధ్ సలామ్

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…

3 hours ago

ఏపీలో ఎవ‌రు గెలుస్తున్నారు? కేటీఆర్ స‌మాధానం ఇదే!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. తాజాగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితంపై స్పందించారు. ఇంకా ఫ‌లితం…

8 hours ago

సీఎం జ‌గ‌న్ ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం..!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటే తాడేప‌ల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజ‌శ్యామల యాగం నిర్వ‌హించారు. అయితే.. ఇది 41 రోజుల…

14 hours ago

కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…

15 hours ago