Political News

టెక్నాలజీ తెలిసిన వారే దొంగ ఓట్లు కనిపెట్టండి మరి!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , టీడీపీ నేత నారా లోకేష్‌ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోల్లో రాళ్లు వేసిన వారేవరో తేల్చేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ వాళ్లే కనుక రాళ్లు వేసినట్లు రుజువు అయితే కనుక ఈ క్షణాన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వారి దగ్గర సరుకు అయిపోయింది కాబట్టే ఇలాంటి పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. నారా లోకేష్‌ హింసను ప్రోత్సహిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా కూడా వచ్చే నష్టం ఏమి లేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చేఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని తరిమికొడతారో..మిమ్మల్ని తరిమి కొడతారో చూద్దామన్నారు. టెక్నాలజీ మొత్తం నాకే తెలుసు అని కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు మరి దొంగ ఓట్లను గుర్తించడంలో కూడా టెక్నాలజీ సాయపడుతుందని తెలియదా అని ప్రశ్నించారు.

సెల్‌ఫోన్‌ కనిపెట్టాను అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబుకి టెక్నాలజీ ఉపయోగించి దొంగ ఓట్లను గుర్తించమన్నారు.ఉరవ కొండలో దొంగ ఓట్ల నమోదు జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం లో చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేసినా సరే మేము ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆధార్, మోభైల్ నెంబర్ తో ఓటు సీడింగ్ జరుగుతోందన్నారు. ఎక్కడ కూడా అక్రమంగా ఓట్ల తొలగింపు అనేది లేదని స్పష్టం చేశారు.

This post was last modified on August 23, 2023 5:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

1 hour ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

1 hour ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

3 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

5 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

6 hours ago