రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులకు ఎంతో ముఖ్యమైన రోజు ఆగస్టు 22. సంక్రాంతి తరువాత మెగా అభిమానులకు అంత పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే..అది మెగాస్టార్ పుట్టిన రోజే. ఈ వేడుకను అభిమానులు ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. అయితే గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సందర్భంలో నాని ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి కొడాలి నాని చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.నేను ఏమి మాట్లాడినా టీడీపీ, జనసేన వారికి బూతులా వినిపిస్తుందని నాని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ కా మారింది.
చిరు పుట్టిన రోజు వేడుకల్లో కొడాలి నాని కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలంటూ ఛాలెంజ్ విసిరారు. “నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయి. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు….. మేమంతా క్లారిటీ గానే ఉన్నాం” అని స్పష్టం చేశారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు.
జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని.. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని తెలిపారు. చిరంజీవి అభిమానుల ముసుగులో, టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొల్లారని మండిపడ్డారు.
చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టానని తెలిపారు. ఆయనను అనేక సందర్భాల్లో కలిశానని.. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని అన్నారు. తమకు ఇచ్చినట్లే…. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పినట్లు వివరించారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా…. ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని’’ ప్రశ్నించారు. తన వెంట ఉన్న వ్యక్తులు 60 శాతం చిరంజీవి అభిమానులే అని కొడాలి నాని వెల్లడించారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…