Political News

పట్నంకు అలా గాలమేశారా?

రాజకీయ నీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తిరుగులేదనే పేరుంది. చాణక్య నీతితో ఎప్పుడు ఎవరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలన్నది కేసీఆర్కు బాగా తెలుసని చెబుతుంటారు. తాజాగా తాండూరు నియోజకవర్గంలో పట్నం మహేందర్రెడ్డిని కేసీఆర్ దారిలోకి తేవడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తామనే ఆశ చూపి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేకుండా కేసీఆర్ చేశారని టాక్.

తాండూర్లో పట్నం మహేందర్రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య విభేదాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. మహేందర్ రెడ్డి కారణంగానే 2018లో బీఆర్ఎస్ నుంచి రోహిత్ రెడ్డిని బహిష్కరించారని చెబుతుంటారు. కానీ అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రోహిత్.. బీఆర్ఎస్ అభ్యర్థి మహేందర్రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత రోహిత్ బీఆర్ఎస్లో చేరడం మహేందర్ రెడ్డికి ఏ మాత్రం నచ్చలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనకే టికెట్ ఇవ్వాలని మహేందర్రెడ్డి పట్టుబట్టారు. కాదని రోహిత్కు ఇస్తే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పారని తెలిసింది.

కానీ ఈ ఇద్దరి నేతలతో మాట్లాడిన కేసీఆర్ ఇద్దరికీ మేలు చేసేలా ఓ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రోహిత్కు ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్రెడ్డి మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు తాండూరు నుంచి మళ్లీ రోహిత్కే టికెట్ కేటాయించారు. ఇక త్వరలోనే మహేందర్రెడ్డితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారని టాక్. ఇప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో రోహిత్, మహేందర్ కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టికెట్ వచ్చిన తర్వాత మహేందర్ ఇంటికి రోహిత్ వెల్లడం, ఇద్దరు మిఠాయిలు తినిపించుకోవడం చూస్తుంటే కలిసిపోయారని అర్థమవుతోంది. .

This post was last modified on August 22, 2023 2:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

6 minutes ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

16 minutes ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

2 hours ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

2 hours ago

పిఠాపురంలో జగన్ పై నాగబాబు సెటైర్లు!

పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…

3 hours ago

ఆమిర్ ప్రేయ‌సి చ‌రిత్ర మొత్తం త‌వ్వేశారు

ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…

3 hours ago