Political News

ఏపీలో దొంగ ఓట్లు…ఇద్దరు అధికారులు సస్పెండ్

ఏపీలో ఓట్ల నమోదు ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సీనియర్ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గతంలో ఉరవకొండలో పర్యటించారు. అనంతపురంలో 6000 దొంగ ఓట్లను చేర్పించారని, అందులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు నిర్ధారించారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.

అయితే, ఆదేశాలిచ్చి రోజులు గడుస్తున్నా భాస్కర్ రెడ్డిని విధుల నుంచి తొలగించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆ తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, జిల్లా పరిషత్ సీఈఓ గా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంలో మరో అధికారిపై వేటు పడింది. గతంలో జడ్పీ సీఈఓ గా ఉన్న శోభా స్వరూపారాణిని సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021 లో జడ్పీ సీఈఓ గా పనిచేసిన స్వరూపా రాణి ఆ సమయంలో 1796 ఓట్లను అక్రమంగా తొలగించడంపై తాజాగా చర్యలు తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ కు గెస్ట్ ఇన్స్ట్రక్టర్ గా స్వరూపా రాణి పనిచేస్తున్నారు.

ఇలా, రాష్ట్రంలోని పలు జిల్లాలలో కొందరు అధికారులు అధికార పార్టీతో చేతులు కలిపి దొంగ ఓట్లను సృష్టించడం, టీడీపీకి జనసేనకు చెందిన ఓట్లను అక్రమంగా తొలగించడం వంటి చర్యలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన నేతలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిగతా జిల్లాలపై కూడా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు దృష్టి పెడితే ఇటువంటి అవకతవకలు మరిన్ని బయటపడే అవకాశాలున్నాయని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు.

This post was last modified on August 21, 2023 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

1 hour ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

3 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

5 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

6 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

6 hours ago