Political News

మా జీపీఎస్‌ ను దేశమే కాపీ కొడుతుంది: జగన్!

ఏపీలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. సీపీఎస్‌ కి బదులు తమ ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. సీపీఎస్‌ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. సోమవారం విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో జగన్‌ మాట్లాడుతూ..అతి తర్వలోనే ఉద్యోగుల కోసం గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ పై ఆర్డినెన్స్‌ తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వానికి భారం పడకుండా ఉద్యోగులకు నష్టం లేకుండా జీపీఎస్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో అమలు చేయబోయే జీపీఎస్ దేశమే కాపీ కొడుతుందన్నారు.

ప్రభుత్వ వ్యవస్థలు బాగుంటేనే ప్రజలు, ఉద్యోగులు బాగుంటారని అన్నారు.ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు కల్పించిన మేలును వివరిస్తూ చంద్రబాబు హయాంలో జరిగిన అన్యాయాలను ఎత్తిచూపారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా మన ప్రభుత్వమే అంత కంటే మిన్నగా ఉన్నామనీ చెప్పారు.

నాడు – నేడు ద్వారా కార్పోరేట్ పాఠశాలల ధీటుగా కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు, రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసి పరిపాలన ను విస్తరించామని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులు ఉద్యోగులనీ, గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఏమీ పట్టించుకోలేదని ఎన్నికలకు ముందు మభ్యపెట్టే పనులు చేశారన్నారు.

గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించామన్నారు. బాబు హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం జగన్. జన్మభూమి కమిటీ ల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నడీఏ ఒకటి దసరా కానుకగా అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

This post was last modified on August 21, 2023 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

9 hours ago