Political News

తెలంగాణలో ‘కరోనా’ లెక్క తేలిపోతుందిక..

తెలంగాణలో కరోనా లెక్కల్లో ఎంతటి అయోమయం కొనసాగుతోందో తెలిసిందే. ప్రభుత్వం రోజూ విడుదల చేసే కరోనా కేసులు, మరణాల లెక్కలపై విశ్వసనీయత అంతంతమాత్రమే అని జనం భావిస్తున్నారు. మీడియాకు వెల్లడిస్తున్న దానితో పోలిస్తే కేసులు, మరణాలు చాలా ఎక్కువ అనే సందేహాలు ముందు నుంచి ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. కనీసం ఈ మధ్య కరోనా పరీక్షలైనా పెంచారు అని సంతోషిస్తున్నారు జనం. అంతకుముందు పరీక్షలు కూడా చాలా తక్కువ సంఖ్యలో జరిగేవి. ఒక సామాన్యుడు వెళ్లి పరీక్ష చేయమంటే అంత తేలిగ్గా టెస్టు జరిగేది కాదు. కరోనా అని అనుమానం ఉన్నప్పటికీ.. పరీక్ష చేయించుకోవడంలో ఉన్న ఇబ్బంది వల్ల ఆగిపోయిన వాళ్లు తెలంగాణలో లక్షల్లోనే ఉంటారేమో.

కరోనా సోకినా పెద్దగా లక్షణాలు కనిపించకుండా.. దానంతటదే తగ్గిపోయి మామూలుగా ఉన్న వాళ్ల సంఖ్య పెద్దగానే ఉంటుందని భావిస్తున్నారు. మరి ఇలా కోలుకున్న వారి లెక్కలు తీయడం ఎలా? ఇందుకు ఉద్దేశించిందే యాంటీబాడీస్ టెస్టు. రక్తం తీసుకుని పరీక్ష చేస్తే ఒంట్లో యాంటీబాడీస్ ఉన్నది లేనిది తేలిపోతుంది.

శరీరంలోకి కరోనా ప్రవేశించిన వారం తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దానిపై పోరాడే క్రమంలో ఈ యాంటీబాడీస్ తయారవుతాయి. ఇవి ఉన్నాయి అంటే.. ఆ వ్యక్తులకు కరోనా సోకినట్లే అన్నమాట. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనాపై పూర్తి అంచనా కోసం ఈ పరీక్షలు కూడా చేస్తున్నారు. మహారాష్ట్రలో కొన్ని నెలల కిందటే ఈ పరీక్షలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ పరీక్షలకు సిద్ధమైంది. ముందుగా హైదరాబాద్ పరిధిలో 25 వేల యాంటీబాడీ టెస్టులు చేయబోతున్నారట. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవాళ్లతో పాటు వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి ఈ పరీక్షలు చేస్తారట. ఆ తర్వాత సామాన్యులకూ పరీక్షలు నిర్వహిస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఈ పరీక్షలు చేయబోతున్నారు. దీన్ని బట్టి మొత్తంగా రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో వ్యాపించిందన్నది అంచనా వేయబోతున్నారు.

This post was last modified on August 19, 2020 3:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

25 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

5 hours ago